HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

26, జనవరి 2011, బుధవారం

శుభా కాంక్షలు



తోటి బ్లాగ్ మిత్రులకు గణతంత్ర దిన శుభాకాంక్షలు

23, జనవరి 2011, ఆదివారం

పుష్య బహుళ ఏకాదశి - సఫల ఏకాదశి- విమల ఏకాదశి

పుష్య బహుళ ఏకాదశి [29-01-2011] కి " సఫల ఏకాదశి " అని "విమల ఏకాదశి" అని పేర్లు .
పూర్వము చంపావతి రాజ్యమును మహిష్మంతుడు అనే రాజు పాలిచేవాడు .అతనికి లుంభకుడు అనే కుమారుడున్దేవాడు .లుంభకుడు అధర్మ వర్తనుడై జీవిస్తుడడం తో కుమారుడని చూడకనే రాజు వానిని రాజ్య బహిష్కరణ శిక్ష విధించెను . లుంభకుడు అడవుల పాలై ఆహారము దొరకక ,తన పరిస్తితికి పశ్చాత్తాప పడుతూ తన దురవస్తకు చింతిస్తూ ఒక చెట్టు క్రింద సృహ తప్పి పది పోయాడు .ఆనాడు ఏకాదశి ఆహారం లభించక ఉపవాసమును అప్రయత్నముగా పాటించడం తో
శ్రీహరి ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదిన్చినట్లు తెలుస్తోంది .లుంభకుడు సక్రమమైన పరిపాలన చేసి మరణాంతరము
వైకుంతమునకు చేరుకున్నాడు .అని పురాణ కధనం.
ఈ ఏకాదశి వ్రాత మహత్యాన్ని పరమ శివుడు స్వయముగా పార్వతికి చెప్పినట్లు పద్మ పురాణం చెబుతోంది .

22, జనవరి 2011, శనివారం

ఇద్దరు ప్రముఖులను ఒకేసారి కోల్పోఇన తూ. గో. జిల్లా , ప.గో.జిల్లాలు.





















1] గ్రామ ప్రజలు ,నియోజకవర్గాప్రజలు ,జిల్లా వాసులు ముద్దుగాపిలుచుకొనే చంటి దొర [కళా సంస్కృతులకు పెద్ద దొర ] శ్రీ S B P B K సత్యనారాయణ రావు ఇకలేరనే వార్త తూ.గో. జిల్లవాసులను దిగ్బ్రమకు గురి చేసింది .పంచాయతీ సర్పంచి నుండి సెంట్రల్ మినిస్టర్ వరకూ ఆయన ఎన్నో పదవులు నిర్వహిచారు .ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆయన విద్యా రంగానికి చేసిన మంచిపనులను ప్రజలు ఇప్పటికీ చెప్పుకొంటారు .ఆయన సొంతవూరు
కపిలేశ్వరపురం లో వేద పాటశాలలో ఇప్పటి చాలా మంది వేదపండితులు చదువుకొన్నారు .ఒక పారిశ్రామిక వేత్తగా ,రాజకీయనాయకునిగా,కళా ,సంస్కృతీ రంగాలలో ఆయన సేవలు మరువ లేనివి.
2] ప.గో.జిల్లా కొవ్వూరు దగ్గర దొమ్మేరులో జన్మించిన శ్రీ E V V సత్యనారాయణ హాస్య బ్రహ్మ జంద్యాల తర్వాత గురువును మించిన శిష్యుడిగా తెలుగు ప్రేక్షక లోకాన్నితన చిత్రాలద్వారా నవ్వులలో ముంచి ,చిత్రం చూస్తున్నంతసేపు ప్రేఖకుడు తనను తను మరచి , తన బాధలను మరచి హాయ్ గా నవ్వుకోనేలా చేసిన E V V ఇకలేరని తెలిసి ప. గో. జిల్లా వాసులను దిగ్రబ్రమకు గురి చేసింది .
ఒకే రోజు ఇద్దరి ప్రముఖులను కోల్పోఇన రాష్ట్రం వారి వారి రంగాలలో వారి సేవలను మరవదు.
[ఫోటోలు

21, జనవరి 2011, శుక్రవారం

నాడు మంత్రి -నేడు బికారి

నాడు N T R స్టాపించిన తెలుగు దేశం పార్టీ నుండి మొట్టమొదటగా ధర్మవరం నియోజక వర్గం నుండి M L A గా గెలుపొంది నీటిపారుదల శాఖామంత్రిగా పనిచేసిన నాగిరెడ్డి నేడు ఉండడానికి శిధిలమైన సొంత ఇల్లు తప్ప తన కుమారునికి వైద్యం చేఇంచలేని స్తితిలో [ఆయనకుమారునికి రొండు తుంటే ఎముకలు మార్చవలసి వుండడం ] వున్నారంటే
ఆయన మంత్రిగా వుండగా ఎంత నిజాయితీగా పనిచేసారో మనకి తెలుస్తుంది .ఈ రోజు TV9 లో మధ్యాన్నం 1.30 గం
ఆయనగురించి ప్రసారం చేసారు . నిజంగా ఈ రోజు ఆయన యొక్క పరిస్తితి చూస్తూంటే ఈ రోజులలలో కూడా అలాంటి నాయకులు వున్నారా ? అని అనిపిస్తుంది . ఏ పదవీ లేకున్డగానే ఒక్క రాజకీయ నాయకునికి వారసుని గానో ,లేక ఒక రాజకీయ నాయకునికి చెంచా గానో వున్నవాల్లె కోట్లు కోట్లు సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి వారు వుండడం చాలా అరుదు .సినిమాలలో చూస్తున్నపుడు ఇలాంటి వారు వున్నారా? అనిపిస్తుంది ,కాని అది నిజమని TV9 కార్యక్రమం ద్వారా ఈరోజు తెలిసింది . ఈ కార్యక్రమం జరుగుతున్నట సేపు రాష్ట్రము లో వివిధ చోట్ల నుండి ఫోన్ ద్వారా ఆయన తో మాట్లాడి తమవొంతుగా ధన సహాయం చేస్తూ వున్నారు .ధనసహాయం చేయడానికి ఆయన యొక్క బ్యాంకు ఎకౌంటు నం .52088486751 SBH SECRATERIAT BRANCH గా ప్రకటించి ఉన్నారు .

20, జనవరి 2011, గురువారం

తలంటు స్నానం తో ఎన్ని లాభాలో [దయ చేసి పూర్తిగా చదవండి]

మన భారతీయ జీవన విధానములో స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత వుంది . ప్రతీ రోజు స్నానం చెయ్యడం మన పద్దతి .కొంతమంది రొండు పూటలా చేస్తారు .పండగ వోచ్చినపుడు ప్రత్యెక స్నానం చెయ్యడం అందరికి తెలిసిందే .వస్తు గుణ దీపిక లో తలంటు స్నానం గురించి వ్రాయబడింది. సంక్రాంతి నాడు తలంటు స్నానం ఒక ప్రత్యెక కార్యక్రమమని అందరికి తెలుసు .తలంటు స్నానాన్ని అబ్యాన్గన స్నానమని అంటారు . కొబ్బరి నూనె,నువ్వులనూనె,ఆవునెయ్యి ,ఆముదం వీటిలో దేనినైన అబ్యాన్గన స్నానానికి వాడవొచ్చు .నూనె చాలా మంచిది .ముందుగా నూనె శరీరానికి బాగా పట్టించి మర్దనా చెయ్యాలి .కనీసం పదినిమిషాలు ఆగిన తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టాలి ,తర్వాత మరో పది నిమిషాలు ఆగాలి తర్వాత పొడి పిండి తో మొత్తం దేహానికి పట్టిన నలుగును వదిలించుకోవాలి. తర్వాత శరీరమంతా శుబ్ర పడేలా రెండు బకెట్ నీళ్ళతో స్నానం చెయ్యాలి. ఈ విధముగా చేయడం వలన గజ్జి, చిడుము, సర్పి, దద్డురులు మొ .చర్మ రోగములు ,దుస్వప్నములు దరి చేరావు. శరీరం మీద మలినాలను ,దుర్గందాల ను పోగొడుతుంది సుఖ నిద్ర ,శరీరం తేలికగా వుండడం ,దేహానికి పుష్టి,కాంతి , మృదుత్వం కలుగుతుంది. కండ్లకు చాలవ చేస్తుంది, పైత్యాన్ని అనుస్తుంది .వృదాప్యం తొందరగా రాదు,అలసటనూ, వాతమును పోగొడుతుంది.సుఖ నిద్ర పట్టును, కాంతి, ఆయుష్షు పెరుగుదల ,బుద్ధి బలిమి ,దేహపుష్టి ,వీర్య వృద్ది కలుగుతాయి .జటరాగ్ని బాగుంటుంది .దేహము కాళ్ళు చేతులు ,గోళ్ళు, సిరస్సులందు పుట్టిన తాపమును ,మంటలను పోగొట్టును .మాడపట్టున చమురు ను వుంచి మర్దించడం వలన చెవులకు ,తక్కిన అవయములకు బలము నిచ్చును .తలవెంట్రుకలు వృద్ధ్హిపరచును ,మృదుత్వాన్ని ఇచ్చును .అరిపాదాలకు చమురు మర్దించడం వలన మంటలను పోగొట్టును .అరికాళ్ళ నొప్పులు హరించును .
అబ్యాన్గన స్నానం వలన ఇన్ని రకముల ప్రయోజనములు వున్నై కాబట్టే మన పూర్వీకులు స్నానానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు .
ఆధునిక యుగంలో అబ్యాన్గన స్నానానికి ప్రాధాన్యత తగ్గిపోవడము వలన దేహానికి అనారోగ్యం ఎక్కువ అవుతోంది .పూర్వ కాలంలో చర్మ వ్యాధులు చాలా తక్కువుగా ఉండేవి. వారం వారం అబ్యాన్గన స్నానం చాలామంచిది .కనీసం పండగలలోనైనా అబ్యాన్గన స్నానం చేస్తే ఏంటో మంచిది .
[ఇది జయధ్వని వార పత్రిక నుండి సేకరణ ]

13, జనవరి 2011, గురువారం

దీని భావమేమి తిరుమలేశా ?

1] నాడు ఈనాడుపై వై యస్

నేడు సాక్షి పై వి హెచ్


దీని భావమేమి తిరుమలేశా ?
2] శ్రీ కృష్ణ కమిటీకి కోస్తా ఆంధ్రా నేతలు డబ్బులు ఇచ్చి తమకనుకూలముగా తెప్పించుకున్నారని ఒక బాద్త్యతగల పార్లమెంట్ సభ్యుడు చెప్పడం ఎంతవరకూ సమంజసం ,దీనిని బట్టి చాలా విషయాలలో వేసిన ప్రతీ కమిటీ ,ఇకపై ఏవిషయం మీదైనా వేసే కమిటీలకు విలువ ఏమి వుంటుంది ?
దీనిని బట్టి నాయకులకే తాము వేసిన కమిటీల పై నమ్మకం లేనపుడు ,ఇక సామన్యుని పరిస్తితి ఏమిటి తిరుమలేశా ?

8, జనవరి 2011, శనివారం

హిందూ ధర్మ శాస్త్రాలు

దేవాలయమునకుకాని, గృహమునకు కానీ వెళ్ళునపుడు కుడి కాలు ముందు పెట్టవలెను.సూర్యోదయమునకు
ముందే నిద్రలేచి స్నానమాచరించి దైవ పూజ చేసుకొన్నవారికి ఆరోగ్యబలం ,అందం,మంచి శరీరం,వాక్ఫలితాలు,మంచి గుణం,ధర్మం చేసే ఆలోచనలు,గౌరవం,కీర్తి, ధనం ఇవన్నియూ వెతుక్కుంటూ వొస్తాయని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది .
దీనివలన నరాల బలహీనత ,బ్లడ్ ప్రేషేర్ దగ్గరికి రావు.
తెల్లవారుజామున ఆకాశమున నక్షత్రములు ఉండే సమయములో ఊదారంగు కిరణాలు ఆకాసమంతా వ్యపించించి ఉంటాయి .అప్పుడు స్నానం చేయడం వలన అల్ట్రా ,ఊదా కిరణాలు మన శరీరం లోనికి వెళ్ళడానికి హేతువు అవుతుంది .నదీ స్నానమైతే మరీ మంచిది.

7, జనవరి 2011, శుక్రవారం

అక్షర సత్యాలు

జీవించడం గొప్ప కాదు !
మనిషిగా మరొకరికి సాయపడుతూ జీవించడం గొప్ప !!
మరనిచాక కూడా జీవించేలా జీవించడం ఇంకా గొప్ప !!!

మనసుచేప్పినట్టు మనం వినడం కాదు !
మనం చెప్పినట్టు మనస్సు వినేలా చేయాలి !!

చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేక పోవొచ్చు !
కానీ ఏ పనీ చేయకుండా ఆనందాన్ని పొందలేము !!

మూర్ఖులు సుఖం ఎక్కడో వుందని ఎదురు చూస్తుంటారు !
కానీ వివేకవంతులు తమ వద్ద ఉన్న దానితో సుఖముగా జీవిస్తారు !!

పొగడ్త మూడుకాళ్ల కుర్చీ లాంటిది !
విర్రవీగి కూర్చుంటే వెనక్కు తూలె ప్రమాదముంది !!

మనం మనకోసం చేసుకునేది మనతోనే అంతరించి పోతుంది !
కానీ ఇతరులకోసం చేసేది శాశ్వతం గా నిలిచి వుంటుంది !!

సద్గుణాలు వుంటే చాలదు వాటిని మంచి కొరకు వినియో గించాలి !

అస్సాద్యాన్ని సుసాద్యం చేయటమే ఉత్తముని లక్ష్యం !

అందరినీ ఆనందిమ్పచేసేవారు ఎల్లప్పుడూ ఆనందం గా వుంటారు !

భౌతిక సంపదలకన్నా శరీర ఆరోగ్యం చాలా విలువైనది !

కోరికలు తక్కువ ఉన్నవారే అనడరికన్నా ధనవంతులు !

జీవితం లో కష్టపడని వారికి సుఖం విలువ తెలియదు !

కీర్తి ప్రతిష్టల లేనివారికి నిజమైన కీర్తి లభిస్తుంది !

ఎల్లప్పుడూ నవ్వుతూ కనపడే మనిషికి ఏ కస్టాలు లేవని కాదు !
కానీ నవ్వు అతని కస్టాలు ఎదుర్కొనే సామర్ద్యానికి ప్రతీక !!
కనుక ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఆరోగ్యంగా వుండండి!!!

1, జనవరి 2011, శనివారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

తోటి బ్లాగ్గర్స్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ ౨౦౧౧ లో మన బ్లాగ్గర్ కుటుంబం మరింత దినదినాభి వృద్ధి చెందాలని మనసార కోరుకుంటూ
-------మారుతి [msr murthy]