HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

18, నవంబర్ 2010, గురువారం

చికెన్ గున్యా ఫీవర్

ఈ ఫీవర్ వొచ్చిన ప్రతీ వ్యక్తీ జ్వరం తగ్గినా కానీ మోకాళ్ళు ,మోచేతులు ,జాయింట్లు దగ్గర నొప్పులు వుంటున్నై .ఎవ్వరిని అడిగినా కానీ ఇవి మూడు నేలలున్టై, ఆరునేలలున్టై అంటున్నారే కానీ సరైన మందు ,వ్యాయామ పద్దతులు చెప్పట్లేదు .దయచేసి ఎవ్వరైనా ఈ నొప్పులు ఎలా తగ్గుతాయో తెలియచేయగలరు .పెయిన్ కిల్లెర్స్ వాడడం వలన తాత్కాలిక ఉపసమనం తప్పించి ప్రయోజనం ఉండుటలేదు .పెయిన్ కిల్లెర్స్ఎక్కువుగా వాడవోద్దని అందరూ చేపుతూవుంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులు అస్సలు ఎక్కువ పెయిన్ కిల్లెర్స్ వాడకూదదంటారు. నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు ఈ నేప్పులతో బాధపడుతున్నారు .ఎవ్వరైనా అనుభవంతో నిప్పుల నివారణ చెప్పగలరని ఆశిస్తున్నాను.

15, నవంబర్ 2010, సోమవారం

తెలుగు పద్య నాటకం

తెలుగు నాటక రంగం ఆదరణ కోల్పోతున్న ఈ దశలో కాజ రామ కృష్ణ & మాధురి గారు [www.andhranatakam.com] అనే వెబ్సైటు ఒకటి ప్రారం భిన్చారు .అది ప్రారంభించి ఎన్నాళ్లైందో తెలియదు గాని నేను ఈరోజే చూసాను . చాలా బాగా డిజైన్ చేసారు .తెలుగునాతకానికి సంబంధించి అందరి పద్యాలు మనకి మాములుగా దొరకనివి కూడా అందులో ఉంచారు .నేను ఆ సైట్ చూసి చాలా ఇంప్రెస్స్ అయ్యాను .ఇదే విషయం అందరికి తెలిచేయాలని ఉద్దేశంతో ఈ పోస్ట్ రాసాను .పద్యనాటక అభిమానులందరూ ఈ సైట్ ద్వారా తమతమ ఇష్టమైన ఆర్టిస్టుల పద్యాలను విని ఆనదిస్తారని ఆశిస్తూ--

25, అక్టోబర్ 2010, సోమవారం

సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి సోలో నాటిక అల్లెగ్జాన్దర్

సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి తన j p ధిఏటర్ బ్యానర్ పై రాజముండ్రి లో నిన్నటి రోజున తన స్వీయ దర్సకత్వంలో Allegjander అనే నాటిక సోలో గా ప్రదర్శించారు ఆ నాటికలో ఆయన ఒక retaired ఆర్మీ ఆఫీసర్ ఆయన ఒక హెల్ప్ లైన్ నడుపుతూ ఆ లైన్ కు ఫోన్ చేసినవాళ్ళకు వాళ్ళ వాళ్ళ సమస్యలు బట్టి సలహాలు ఇస్తూ సమస్యల పరిస్ఖారానికి సహాయపడతారు. ఇందులో మిగిలిన నటులు ఎవరూ లేకుండగా వారి వాయిస్ ను మాత్రమె రికార్డు చేసి వాళ్ళు ఫోన్ లో మాట్లాడు తున్నట్లుగా వినిపించారు .ఈ ప్రయోగం చాలా బాగుంది దాదాపు ఒక ఘంటా నలభై నిమిషాలు బాగా రక్తి కట్టించారు.నేటి సమాజం లో జరుగుతున్న సమస్యలు గృహ హింస ,ర్యాగింగ్ ,ఆసిడ్ దాడులు , భగ్నప్రేమ మొదలైన విషయాలమీద చెపుతూ తనకు తానుగా తాగుడు ,పొగాకు వలన ఎంత నష్ట పోయాడో తెలియచేస్తూ ముగించారు. ఈ ప్రదర్శనకు నేను ,నా స్నేహితులతో వెళ్లాను వాళ్లకు అస్సలు డ్రామా ,నాటకాలు అంటే పడదు కాని నా బలవంతం మీద వొచ్చారు .ఆడిటోరియం లోపలి వొస్తూ వాళ్ళు చివరగా కూర్చుందాము మద్యలో పారిపోవొచ్చు అన్నారు .అల్లా అని కూర్చొన్న వాళ్ళు పూర్తీ అయ్యేవరకూ లేవలేదు .ఇది ఎందుకు చెపుతున్నాను అంటే ఈ నాటిక మీకు దగ్గరలో ఎక్కడైనా వేస్తున్నట్లు గా తెలిస్తే తప్పక చూడండి .ఈ సోలో ప్రయోగం బాగుంది. ఈనాటికలో రికార్డు చేసిన వాయిస్ ను ఆపరేట్ చేసే vyakti పై ఈ vijayam aadhaara padi vuntundi

18, సెప్టెంబర్ 2010, శనివారం

నమస్కారము-విశిష్టత

సువిశాల ప్రపంచములో భారతీయ సంస్కృతీ ఎంతో సుందరమైనది. ఈ భారతీయ సంస్కృతి గాంభీరమైనదిగా ప్రపంచమంతా సకల జనులందరి చేత ఆమోదించబడటం ,గౌరవిన్చబడటం భారతీయులుగా సంస్కృతి పరిరక్షణ వారసులుగా మనందరికీ గర్వకారణం .
మన సాంప్రదాయం, ఆచార వ్యవహారములే భారతీయులుగా మనమందరం ఒకరినొకరు నమస్కారములు అని పలకరించుకొనే క్రమంలో వినమ్రతతో తల వొంచి రెండు అరచేతులు హృదయం ముందర కలపటం జరుగుతుండటంతో మన ఎదుట వ్యక్తికి హృదయపూర్వకముగా నమస్కరిస్తున్నట్లుగా క్రియా రూపములో ప్రదర్శిస్తున్నాము.ఇలా శిరస్సు వొంచి ,చేతులు జోడించి మనం చేసే నమస్కార ప్రక్రియే మన దేశ సంస్కృతిని ఎల్లెడలా చాటి చెబుతూ గౌరవ ప్రక్రియ లో ప్రపంచ ప్రజలకు మాదిరిగా నిలిస్తుంది .
నమస్కారమనేది ఆద్యాత్మిక పరంగా ఇకా లోతైన అర్ధాన్ని సూచిస్తుంది . ప్రాణ శక్తి, దివ్యత్వం, ఆత్మ ,పరమాత్మ అందరిలో ఒకేలా ఉండడంతో ఈ కత్వమును గుర్తించి రెండు చేతులు కలిపి తలవొంచి ఇతరులను కలసినపుడు వారిలోనున్న దివ్యత్వమునకు నమస్కరిస్తున్నట్టుగా అర్ధం.
అదే విధముగా ఇటీవల కాలములో కోందర పెద్దల వద్ద నేను ఈ క్రింది నమస్కార రీతులు గమనించాను. ఆచరించే ప్రక్రియ ఆరంభించేను. అంతే! వారి పరిపూర్ణ మైన ప్రేమ ,దివ్యత్వం ,ఉదారత్వం నిండిన హృదయాల నుండి ఉద్భవించే సుభ దీవెనలు అద్భుతమైన శక్తిని కలుగ చేస్తాయని విశ్వసించాను .
1.ప్రతుత్ధానం :లేచి నిలబడి స్వాగతం పలుకుట .
2.నమస్కారం :నమస్కారం ద్వారా విదఎయత వ్యక్తపరచటం .
3.ఉపసంగ్రహన :పెద్దలు, గురువుల పాదాలను తాకడం .
4.సాష్టాంగం : కాలు, మోకాళ్ళు, ఉదరం, నుదురు, అన్ని నేలను తాకేతట్లు పెద్దలు,గురువుల ముందు సాగిలపడి నమస్కరించడం.
5.ప్రత్యభివందనం : ప్రతినమస్కారం చేయుట .
కావున భారతమాత ముద్దు బిడ్డలమైన మనమందరం ఆద్యాత్మిక సంస్కృతిని తనలో నిలిపుకొన్న సంప్రదాయ నమస్కారం ద్వారా ప్రజల పట్ల మనకున్న గౌరవమును ప్రతిబంబించేలా ముందుకు సాగాలని వినమ్రతతో ప్రాదిస్తున్నను.
అందరికి నమస్కారములు .
సర్వేజనో సుఖినో భవంతు
[ఇది కొచ్చెర్ల గంగాధర్ ఉప సంపాదకులు చే శ్రీ కనక దుర్గ ప్రభ ధర్మ ప్రచార మాస పత్రిక లో ప్రచురించబడినది. ]

29, ఆగస్టు 2010, ఆదివారం

మహా పుణ్యం శ్రీ తులసి దళం

ఆద్యాత్మిక పరంగా ,ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలననే తులసి భూలోక కల్ప వృక్షం గా దేవతా వృక్షం గా పేరు పొందింది.భగవంతుని పూజకు తులసి అతి ప్రసస్తము .తులసి గా శ్రీ మహాలక్ష్మి ఏ స్వయముగా అవతరించినట్లు పురాణములు చెబుతున్నాయి .
శ్రీ కృష్ణుని ప్రేమకు పాత్రురాలైన గోపిక శ్రిక్రుస్తుని వేడుకోగా ,భూలోకంలో జన్మించి కొంతకాలం జీవించిన అనంతరం తన అంశ లో చేరేలా అనుగ్రహహించాడు స్వామి .ఈ శాప కారణంగా లక్ష్మి అంశ గా జన్మించి ,వృక్షం గా మారినట్లు శ్రీదేవి భాగవతంలోని ఒక కదా ద్వారా తెలుస్తోంది .
తులసి ప్రియురాలు కనుక విష్ణువును తులసి దళాలతో పూజించేటప్పుడు పాదాల వద్దనే తులసి దళాలను వుంచవలెను .
పవిత్ర దినములలో తులసి కోయరాదు , గోళ్ళతో తుంచ రాదు .సూర్యాస్తమయము తర్వాత తులసి కోయరాదు . మిట్ట మద్యాహ్న్నం ,అర్ధ రాత్రి వేల లో గాని తులసిని త్రుంచ రాదు . ఒకవేళ అలా చేస్తే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి .
ఎవరి గృహములో తులసి మొక్క వుంటుందో ,వారి గృహం తీర్ధ స్వరూపముగా వుంటుంది. తులసి దళా ల తో శివ కేశవులను పూజించిన వానికి మరల జన్మ ఉండదు, ముక్తిని పొందుతాడు.నర్మదా నదిని చూడడం ,గంగా స్నానము చేయడం,తులసి వనాన్ని సేవిచడం ఈ మూడు సమాన ఫలములను ఇస్తాయి .ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక సుద్ధ పౌర్ణమి వరకు చాత్రుమాస దీక్ష కావున ఈ సమయములో తులసి మొక్కను చోటు మార్చి పాత రాదు.
తులసి సన్నీ దానము నందు విష్ట్ను మూర్తి ఏకాంతముగా ఉండును కనుక స్త్రీలు దళములు కోయరాదు .పురుషులు మాత్రమె కోయవలెను .
తులసి ఆకును కోసిన లగాయతు ఒకసంవస్త్సరము ,మారేడు మూడు సం. ,తామర పూలు ఏడు రోజుల వరకు పూజకు పనిచేస్తాయి .
తులసి మాల ఎక్కువుగా రాముడికి ,కృష్ణుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది.బుద్ధిని ,మనస్సును ప్రశాంతముగా ఉంచుటకు ఈ మాల ఎంతో ఉపయోగాదాయకం .తులసి మాలను ధరించడం వలన సర్వ పాపాలు నాసి స్తా
ఇన్ని ఉపయోగాములున్న దేవ వృక్షము తులసిని పెంచక మేడిపండు సామెత వలె డబ్బు వెచ్చించి కొనే క్రోటన్ మొక్క విలువ ఏపాటిదో కాస్త తెలుసుకొంటే తులసిదళం మహా పుణ్య ఫల దాయకమని గ్రహించగలుగుతారు .
తులసిలో లభించే అనేక ఔషద గుణములను సంబంధించి వైద్యులు ఇంకా ప్రయోగాలు నిర్వహిస్తూనే వున్నారు.

18, ఆగస్టు 2010, బుధవారం

విభూది ప్రాశస్త్యము

[నామము] బొట్టు లేని నుదురు వృధా అన్నారు. విభూది, కుంకుమ,చందనము వంటి వాటిని తప్పని సరిగా ప్రతీ రోజూ మరువక, విడువక నుదుట ధరించాలి.
విభూది కి అనేక పేర్లువున్నవి .అది మనలని రక్షించుట చే రక్ష, పాప ఖర్మలను ముక్కలు ముక్కలు గా భస్మము చేయుటవలన నీరు [భస్మము] అనియు , లెక్క లేనన్ని సంపదలను ప్రసాదించుట వలన విభూతి అనియు,ఐదుఅక్షరములను ఉచ్చరిస్తూ ధరిచుట వలన [ఉచ్చరింప జేయుటవలన]విభూతి కి పంచాక్షరము అన్న విశిష్ట నామము వున్నది . అజ్ఞానమును తొలగించి శివజ్ఞానమనెడు శివ తత్వమును బోధించుట వలన విభూతికి పశితం అన్న నామము వున్నది .ఆత్మల లోని మాలిన్యము పోగొట్టి పవిత్రపరచుట వలన దానికి "సారము" అన్న నామమూ ఉన్నది.
వ్యాధులకు భయపడను, జనన మరణములకునూ భయము చెందను ,విభూతి ధరించిన వారిని చూసినంతమాత్రాన భయపడుతున్నానని మానిక్కవాచగర్ తెలుపుతున్నారు.
విభూతిని చూపుడు వేలితో తీసికొని ధరించరాదు . నుదుటి భాగమున నిండుగా విభూతిని పూసికొనవలయును.
వస్తువులను నిప్పుల్లో వేసి కాల్చినపుడు అవి భస్మమగును .[శంఖము తప్ప ]కానీ, నల్లటి రంగుతో నున్న గోమయము [ఆవు పేడ] ఉండ చేసి నిప్పుల్లో కాల్చినచో అది తెల్లటి రంగుతో విభూతి గా మారి మనకు లభించుచున్నది . ఇట్టి విభూతి మన మనస్సును శుబ్రపరచును ,దేహాన్ని శుబ్రపరచును .
విభూతిని నిండు భక్తితో భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ధరించుకొని, దేవుణ్ణి ప్రార్ధించు నప్పుడు తపము ,దానము, ధర్మమూ మొ. చేసినంత ఫలము లభించును . ఏడుకోట్ల మంత్రములను జపించిన ఫలములనూ, గంగా, కావేరి, గోదావరి వంటి పుణ్య నదులలో తీర్ధమాడిన ఫలములనూ, అశ్వమేధ యాగము చేసిన ఫలములనూ విభూతి ధరించినవారు పొందుతారు . ఔషదము [మందు] సేవించువారు పత్యమున్నట్లు ,విభూతి ధరించు వారు తగిన నామ మంత్రములను జపిస్తూ వస్తే లేఖలేనన్ని ఫలములను భగవంతుడు కొల్లలుగా ప్రసాదిస్తాడు.
విభూతి ధారణ అన్నది మనకు కవచము వంటిది. దుష్ట శక్తుల బారినుండి మనలని కాపాడునట్టిది.
తడసిన వస్త్రముతో ,ఏక వస్త్రముతో ,లోపలి వస్త్రము లేకుండగా గాని విభూతిని దరించ రాదు . నెల మీద చింద కుండా జాగ్రత్తగా విభూతిని తీసుకొని దరించ వలెను .పనికిరాని విషయములను మాట్లాడుకుంటూ విభూతిని ధరించరాదు .భయ భక్తులతో విభూతిని ధరించి ,భగవంనమమును జపిస్తూ వచ్చినచో జీవితములో లేఖలేనన్ని సౌభాగ్యములు పొందవొచ్చును.
విభూతిని తిరి పున్దరముగా ధరించునపుడు శరీరమునందున్న16 స్థానములందు పూసికొనవలయును. విభూతి ధరించాలంటే శరీరమంతయు పూసికోనవోచ్చును. దీనిని మొత్తము భస్మము ధరించుట అంటారు. విభూతిని ధరించవలసిన 16 స్థలములను పలు రకాలుగా చెబుతారు.
అవి: పాలభాగము [1] ,శిరము[1] ,వక్షస్థలము[1],బొడ్డు[1], మోకాలి చిప్పయందు [2], భుజములు[2], మోచేయి[2], మణికట్టు[2], మేడప్రక్కలు[2], వీపు[1], మెడ[1] నందు విభూతిని నీటితో కలిపి ధరించవలెను .
విభూతిని ......పట్టించునపుడు మూడు గీతాలుగా విభజించుకొని పూసుకోనవలయును. దీనిని తిరిపుండ్రం అంటారు .అలా పట్టించునపుడు మూడు గీతలను ఒకదానికి ఒకటి తాకకుండా ,అధికముగా వొంగిపోకుండగా ,మరీ వెడల్పు లేనట్లుగా ను చూడవలెను .
విభూతిని ఎల్లరునూ ఎప్పుడునూ ధరించరాదు .తగినటువొంటి గురుదేవుల వద్ద సక్రమముగా దీక్ష పొందిన వారు, పెద్దవారు మాత్రమె విభూతిని నీటితో కలుపుకొని ఉదయము ,సాయంత్రము ధరించావోచ్చును.
దీక్ష పొందని వారు మద్యాహ్నము వరకూ విభూతిని నీటితో కలిపి దరించ వచ్చును .ఆపై అలా దరించ రాదు.

13, ఆగస్టు 2010, శుక్రవారం

ఇండియన్ ఇడల్ శ్రీ రామ్ ప్రత్యేకతలు

మన శ్రీ రామ్ తన పాటలతో విదేశాలలో సైతం ప్రేక్షకులను మైమరపించాడు. గత సం. సింగపూర్, దుబాయి, లండన్లలో అనేక ప్రదర్సనలు ఇచ్చాడు .అతని గాన మాధుర్యానికి విదేశీయులు తన్మయులై ప్రసంసల వర్షం కురిపించారు .అటువంటి మన తెలుగు సోదరుడు ప్రస్తుతం సోనీ టీవీ లో ఉత్తరభారత సోదరులతో పోటీ పడుతున్నాడు. మన తెలుగు వాడిని గెలిపించుకోవడం మన అందరి బాద్యత. అతని గెలుపు మనగేలుపే. అతని విజయం మన విజయమే .అతని కీర్తి మన తెలుగుప్రజలందరి ఘన కీర్తి. అతనికి మద్దత్తుగా SMS చేయండి .అఖండ విజయం చేకూర్చండి. శ్రీ రామ్
* తన 8 వ ఏటనే సంగీత కచేరి చేసాడు .
*ఇంతవరకు 80 ప్రదర్సనలు ఇచ్చాడు .
*శ్రీ మనో, శ్రీమతి మాలతి, శ్రీమతి సునీతలతో కలసి ప్రదర్సనలు ఇచ్చాడు .
*కోటి,ఎం .ఎం. కీరవాణి, మాధవపెద్ది శురెష్ ,వందేమాతరం శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యం,నిర్వాహణలో ప్రదర్సనలు ఇచ్చాడు.
*సింగపూర్[10.10.09], దుబాయి[20.01.09] , లండన్ [10.04.10] లలో ప్రదర్సనలు ఇచ్చాడు.
*25.01.09,19.10.09 న మైసూర్ లో ప్రదర్సన ఇచ్చాడు.
*ఇంతవరకు 24 సినీమా లలో పాటలు పాడాడు .
*ఇప్పటికి 50 సినిమా పాటలు పాడాడు .
*తన 17 వ ఏటనే సినిమాలలో పాటలు పాడడం ప్రారంభించి "ఆనందరాగం కాంటెస్ట్ "విజేతగా నిలిచాడు .
*హిందీ ప్రైవేట్ ఆల్బంను ఒకదానిని విడుదల చేసాడు,ఇంతవరకు DIVOTIONAL ALBUMS 28 పాడాడు.
శ్రీ రామ్ గెలుపును ఆకాన్షిస్తూ రాజమండ్రి లో కొందరు ఔస్తాహికులు శ్రీ రామ్ అభిమాన సంఘం గా ఏర్పడి విస్తృతమైన ప్రచార కార్యక్రమమ చేపట్టారు .అందులో భాగంగా వివిధ కాలేజీలు ,స్వచ్చంద సంస్తలు ,మార్కెట్లు ప్రధానంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు .తెలుగు ఆత్మా గౌరవానికి సంబందిన్చినదిగా శ్రీ రామ్ గెలుపు కోరుకుంటున్నారు .దయచేసి మీరుకూడా SMS ద్వారా శ్రీ రామ్ ను గెలిపించండి .
మీ మొబైల్ నుండి SREERAM అని టైపు చేసి 52525 కు SMS చేయండి .
[ఇది ప్రజా పత్రిక నుండి సేకరణ ]

8, ఆగస్టు 2010, ఆదివారం

శ్రావణ లక్ష్మి

చిరు జల్లులు పడుతూవుంటే పట్టు చీరలు తడిసి పోతాయని బెంగ పడుతూనే ,పసుపు పూసిన పాదాలతో ,గాజుల గలగలల తో ,చేతిలో వాయనం శనగలూ తాంబూలం మూటలు పట్టుకొని గుంపులు గుంపులు గా కబుర్లాడుకుంటూ, కిలకిలా నవ్వుకుంటూ నడిచే ముత్తైదువులతో వీధులన్నీ కళకళలాడి పోతుంటాయి. శ్రావణ మాసం లో శుక్రవారాలూ ,మంగళవారాలూ ప్రముఖంగా కనపడే దృశ్యమిది ఆంధ్రప్రదేశ్ లో .శ్రావణ మాసం లో స్త్రీలు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి ని సౌభాగ్య ,సంపదలు కోరి వ్రతం చేస్తే --
జంద్యాల పౌర్ణమిగా శ్రావణ పౌర్ణమి నాడు పురుషులు -
యజ్ఞోపవీతం పరమం పవిత్రం
అంటూ పాత జంధ్యాన్ని విసర్జించి ,నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం ఆచారంగా వొస్తోంది. పై "ఓం భూర్భువస్సువః తత్వితురవేన్యం అంటూ గాయత్రీ మాతను ధీ శక్తిని ,బలాన్ని, తేజస్సును కోరి ప్రా ర్దిస్తారు.ఇలా శ్రావణ మాసం లో భార్యా భర్తలిరువురూ దైవబలాన్ని సముపార్జించుకొని నిత్య నైమిత్తిక కార్యాచరణకు పునరంకితమౌతారు .
రాఖీ పండుగ మరొక కనువిందు చేసే సాంప్రదాయం . పౌర్ణమినాడు సోదరుని చేతికి రంగుల రాఖీ [ తోరం] కట్టి ,తీపి తినిపించడం ,వారుకూడా తోబుట్టువుల సంతోషాన్ని ఇనుమడింప చేసేలా కానుకలివ్వడం, అందరూ కల్సి ఆనందంగా పండగ జరుపుకోవడం ,అన్నా చెల్లెళ్ళ బంధం వృద్ధి చెందించే చక్కని సంబరాల రాఖీ పండగ .ఇది ఎక్కువుగా ఉత్తర భారత దేశం లో జరుపుకొనే పండుగ ,ఇప్పుడిప్పుడే దక్షిణాదిన ,ఇతరదేశాల్లో కూడా జరుపుకుంటున్నారు.
పొలాల్లో ఊడ్పులు పూర్తయి వర్షపు జల్లులకు చేను పచ్చదనం సంతరించుకొని రైతుకు ఆనందం కలిగిస్తుందీ మాసం . కొత్తగా పెళ్లి వొచ్చిన కోడళ్ళూ ,అత్తవారింటికి వెళ్ళే కూతుళ్ళూ ,ఇల్లలికి హడావిడితో కూడిన ఆనందం అన్న చెల్లెళ్ళ పరస్పర పరస్పర ప్రేమ సత్కారం .ఇదీ మన సాంప్రదాయం .

5, ఆగస్టు 2010, గురువారం

గ్యాస్ ట్రబుల్ కోసం సొంత ఔషదం

మనలో చాలా మంది గ్యాస్ వల్ల ఇబ్బంది పడుతుంటాము ,అటువొంటివార్కిఇంట్లో మనం తయారుచేసుకొని సులువుగా ఆ ఇబ్బందినుండి బయట పడవచ్చు .ఇది నా స్వానుభవం మీద నేను వాడిన తర్వాత మీకు చెబుతున్నాను .
కొద్దిగా ధనియాలు, జీలకర్ర ,శొంటి ఈ మూడింటిని సమపాళ్ళలో తీసుకొని విడివిడిగా గ్రైండ్ చేసి ,అన్నిటిని కలిపి తగినంత ఉప్పు వేసి ఒక సీసా లో వేసుకొని భోజనం తర్వాత గ్లాస్ మజ్జిగలో ఒక చెంచా పొడి వేసుకొని రోజు తాగండి .భోజనం తర్వాత అలసట, అజీర్తి, గ్యాస్ వుండవు. ఇది నేనొక పుస్తకంలో చదివి స్వయంగా వాడను .మీరు వాడి మీకు నచ్చితే మరికొంత మందికి తెలియచేయండి. గ్యాస్ ట్ర బుల్ తో ఇబ్బంది పడుతూ ఎక్కువ మందులు వాడనవసరం లేదు .

1, ఆగస్టు 2010, ఆదివారం

సప్త చిరంజీవులు [౨]

సప్త చిరంజీవులలో 6 వ వాడు కృపుడు
శరద్వంతుని కుమారుడు .శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు ,ఇంద్రుడు ఈతని తపస్సును భగ్నము చేయుటకై ఒక అప్సరసను పంపినాడు .ఆమెను చూడగానే యితడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి మరియొక చోటుకు వెళ్ళినాడు ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు . కృపునితో పాటుగా సరద్వాన్తునికి మరియొక ఆడపిల్ల కల్గినది .ఆపిల్లలను వదిలి తపస్సుకి మరిఒక చోటికి వెళ్ళినాడు .అటువంటి సమయమున వేటకు వోచిన శంతనుడు .ఈపసికండులను చూచి కృపతో పెంచినాడు .అందులకే వీనికి క్రుపాయని క్రుపుదని పేర్లు వోచ్చినవి.శరద్వంతుడు కృపునకు ఉపనయాదికములను చేసి ధనుర్వేదమును నేర్పినాడు .భీష్ముని కోర్కె మన్నించి ధర్మజాడులకు ధనుర్విద్యను నేర్పినాడు .భారత యుద్ధం లో దుర్యోధనుని పక్షమును నిలిచి యుద్ధం చేసినాడు . యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు. ద్రుతరస్త్రునితో కూడి తపోవనమునకు వెళ్ళినాడు రాబోవు సుర్యసవర్నిక మన్వంతరములో సప్తరుషులలో కృపునకు ఒక స్తానము పొండువాడుగా వున్నాడు .యితడు చిరంజీవుడు.
7.పరసురాముడు:-
యితడు రేణుకా జమదగ్నుల కుమారుడు .తండ్రి ఆజ్ఞను మన్నించి తల్లిని కూడా సంహరించినాడు.ఇతనిని మెచ్చుకొన్న తండ్రి వరం కోరుకొమ్మనగా తల్లిని బ్రతికించమన్నాడు .తన సోదరులకు తండ్రివలన శాపమును తొలగింప చేసాడు .జమదగ్నికి తాత బృగు మహర్షి ,ఆ మహర్షి ఉపదేశంతో హిమాలయమునకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేసినాడు .ఈశ్వరుడు బోయవాని వేషమున వొచ్చి పరశురాముని పరీక్షించినాడు .శివుని ఉత్తర్వుతో తీర్ధ యాత్రలు చేసినాడు ,శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందినాడు .

20, జులై 2010, మంగళవారం

సప్త చిరంజీవులు

సప్త చిరంజీవులు
౧.అశ్వద్దామ ,౨. బలి ,౩.వ్యాసుడు,౪.హనుమంతుడు,౫.విభీషణుడు,౬.కృపుడు,౭.పరశురాముడు.
౧.అశ్వద్దామ:- ద్రోణాచార్యుని కుమారుడు,మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు.
ఇతడు చిరంజీవి.
౨.బలి :-ప్రహలాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు,ఇంద్రుని జయించినవాడు,వామనమూర్తి కి మూడడుగుల భూమిని దానం చేసి,అతని చే పాతాళమునకు త్రోక్కబడినాడు .కానీ ఈతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గదాదారిగా ఈతని వాకిటికి కావాలి కాచేవాడు .యితడు చిరజీవి. ఇతని సత్య సంధతకు మెచ్చిన మహా విష్టువు ఈమన్వన్తరములో దైత్త్యేద్రత్వమును , పై మన్వంతరములో దేవేంద్రపదవిని అనుగ్రహించాడు .
౩.వ్యాసుడు :-సత్యవతీ పరాసరుల కుమారుడు.కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబదేవాడు. అస్తాదాస పురాణాలను, బ్రహ్మసూత్రములను,భారత భాగవతములను ఇంకనూ అనేక తత్వ గ్రంధములను రచించాడు. వేదాలను విడబరచిన వానిని వ్యాసుడు అని పేర్కొంటారు. ఒక్కొక్క యుగములో ప్రశంసింప బడినారు .
౪.హనుమంతుడు:-కేసరి భార్య అగు అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞా ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో వున్నా శివుని శక్తిని ఆమెకు ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టినాడు .సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు .పరమేశ్వరుని అపరావతారముగా కొలవబదినవాడు హనుమంతుడు .రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేస్వరుని హతమార్చతంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ .మహా భారతయుడంలో అర్జునిని ధ్వజమున వెలసి పాండవుల విజయమునకు కూడా దోహదకారి ఇనాడు .ఇతడు చిరంజీవుడు .రామ భాక్తాగ్రేస్వరుడైన ఆంజనేయుడు చిరంజేవిగా తన భక్తులకు సకల శుభాలను అనుగ్రహిస్తూ ఉంటాడు.
౫.విభీషణుడు:-కైకసికిని విస్వబ్రహ్మకు కలిగిన మూడవ కుమారుడు . బ్రహ్మపరమున ఈతడు సుశీలుడైనాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ .రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి ,సన్మార్గము గూర్చి చెప్పేవాడు .సముద్రమును దాటుటకు శ్రీ రామునకు ఉపాయము చెప్పినవాడు .రావణుని హతమార్చుటకు ఉపాయము చెప్పినవాడు.రావణుని అనంతరం లకాధిపతి ఇనాడు .ఈతడు చిరంజీవుడు.
[మిగిలిన ఇద్దరు గూర్చి తర్వాత పోస్ట్ లో ]

27, జూన్ 2010, ఆదివారం

ఉత్తరం

కేవలం క్షేమ సమాచార వ్యాపార లావాదేవిల సమాహారమే కాదు
రాసినా, చదివినా హృదయాన్ని ఆవిస్కరింప చేసే అక్షర అమ్ములపొది ఉత్తరమంటే .

అక్షరాలకు పెదవులను కడపడమే కాకుండగా , భావాలకు హృదయాలను మోపగాలిగితే
ఉత్తరం ఉత్తరమే కాదు- ఓ గ్రంధాలయం కూడా !

దూర తీరాలె కాదు , వీధికి ఎదురు వీధి, సందు ప్రక్క సందు
దగ్గర దగ్గరగా మసలుతున్నా చేతి ఉత్తరాలతో చేరువై ఓ ఇంటి వారైనా
వాళ్ళ ప్రేమ సౌధానికి పునాది రాయిగా నిలిచింది ఉత్తరమే కదా !

తినగా తినగా వేము అన్నట్టు ఉత్తరాలు రాసి రాసి కవులైన వాళ్లెందరో ......
చదివి, రాసి ఉత్తేజితులైన నాటి దేశ నాయకులేన్దరికో ఉత్తరమే మహత్యం ,ఉత్తరమే శరణ్యం!

అనర్ధాలు, అల్లకల్లోలానికి ఆటంబాంబులే అక్కరలేదు
ఆటవికత ఆవహించిన చేతుల్లో అక్షరాలూ అంతటివే ....
అలాంటి ఉత్తరాలు తులసివనంలో గంజాయి మొక్కలు

ఒక్క సెంటీగ్రేడ్ ఉస్త్నోగ్రత పెరిగి లక్ష టన్నుల గోధుమ పంట గల్లంతైనట్లు
చిన్న సెల్ ఫోన్ మోజుకు చేరువై ఆనిముత్యల్లంటి భావ పుష్టి పద సమూహ ఉత్తరాలని
ఒల్దేజి హోమేలలో తల్లితండ్రులను చేస్తుంటే
ఏ భాషా శిశువైనా పరిపుష్టిగా ఎలా పెరుగుతుంది !
తల్లిపాల ఉత్తరాలని పట్టందే !!

25, జూన్ 2010, శుక్రవారం

దీపారాధన ఫలితాలు

1. దీపానికి ఒత్తులు వేయుతవలన కలుగు ఫలితాలు .
తామర కాదా వొత్తులు వేస్తె మూడు జన్మల పాపాలు పోతాయి
అరటి దూట నారతో ఒత్తులు వేస్తె తమ కుల దేవత శాపం పోవును.
కొత్త పసుపు తువ్వాలుతో ఒత్తులు వేస్తె దాంపత్య జీవితం అన్యోన్యం గా వుంటుంది.
కొత్త తెలుపు గుడ్డని పంనేరులో ముంచి [నానబెట్టి] ఎండబెట్టిన తరువాత ఒత్తులుగా తయారు చేసి వేసుకొంటే లక్ష్మి కటాక్షం లభించి దుస్త శక్తులు తోలుగును.
2.దీపం లో వేసే నూనె వలన కలుగు ఫలితాలు .
నెయ్యి -------- లక్ష్మి కటాక్షం
ఆముదం ------కస్టాలు తొలుగుట
నువ్వులనూనె ------ మద్యమం
గమనిక: వేరుశనగ నూనె మొదలైన తక్కువరకం నూనెలతో ఆరాధన చెయ్యరాదు .
3. దీపం ఈ దిశలో ఉండవలెను
తూర్పు -----కస్టాలు తీరి మంచి జరుగును
పడమర ---- గ్రహ దోషం పోవును ,
అన్నదమ్ముల మద్య పగ చల్లరును
ఉత్తరం ----- విద్య ,సుభాకార్యములు మంచిగా జరుగును
దక్షిణం ---- అపసకునం

20, జూన్ 2010, ఆదివారం

వేకువ జామున లేవడం వలన ఫలితాలు

౧. ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలకు బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో నిదుర లేవ వలెను . ముందుగా శ్రమగా అనిపించినా అలవాటు అయ్యేకొలది సులభం అనిపిస్తుంది .దీని వలన ఆరోగ్యం, పరిపూర్ణ ఆయుషు కలుగుతాయి . బ్రహ్మ ముహూర్త వేళలో దేవతలు, మన పెద్దలు మన ఇంటికి వొస్తారు .ఆ టైములో మనం మెలకువ తో వుంది వారిని మనసారా తలచుకొంటే వారందరూ సంతోషపడి మనకు మంచిని చేస్తారు .
౨. ఏ దిశలో కూర్చొని భోజనం చేయవలెను.
తూర్పు-- ఆయుషు పెరుగును
పడమర-- ఐశ్వర్యం పెరుగును
ఉత్తరం-- దరిద్రం
దక్షిణం-- కీర్తి పెరుగును
ఒక మూల కూర్చొని భోజనం చేయ రాదు .

1, మే 2010, శనివారం

లంకంత కొంప ,కొంపంతా లంకే

లంకంత కొంప అనే పదం సమాజం లో చాలా విరివిగా వినిపిస్తుంది. కానీ,కొంపంతా లంకే ! అనే పదం క్రొత్తగా అనిపిస్తోంది కదూ!చదివితే మీకే అర్ధమవుతుంది.ఇల్లు కట్టుకొనేటప్పుడు వసతులు, సౌకర్యాలు ,హంగులు ,రంగులతో చాలా విలాసవంతముగాను, ఆకర్షనీయం గాను కట్టుకుంటారు.కానీ మనుష్యులు మాత్రం నవగ్రహాల్లా ఒకరికొకరు పొంతన లేకుండా జీవనం సాగిస్తుంటారు. ఒకరంటే ఇంకొకరికి పడదు.ఒకరి మాట ఇంకొకరి వద్ద చెల్లదు. ఏ దారెటు పోతోందో ఎవరికీ తెలియదు.ఎవరి ధోరణి వారిదే. ఎడమొహం, పెడమొహంగా బ్రతుకును వెళ్ళదీస్తుంటారు. ఇంటిలో వుండడం కంటే బయటనే మనశాంతి గా ఉంటుందని ఎక్కువుగా బయటనే కాలక్షేపం చేస్తుంటారు . నిజంగా అన్నీ వున్నా నోట్లో శని ఉంది అన్నట్లు చాలా దుర్భరమైన జీవితం గడుపుతూవుంటారు.ఇందుకు కారణం......
౧.డబ్బులనే ద్యేయంగా,పరమావధిగా భావించడం.
౨.మానవ సంబంధాలు కేవలం శారీరకమైన సంబంధాలకే పరిమితమవడం .
౩.ఊహాపోహలు, అపార్ధాలు, పొరపొచ్చాలు పెరిగి సత్సంబంధాలు దెబ్బతినడం .
౪.కాలం వెచ్చించి తోటి కుటుంబ సబ్యుల కష్టసుఖాలను,వారి ఇబ్బందులను పట్టించుకోకపోవడం.
౫.సమైక్యతా, అన్యోన్యతలు లోపించడం.
౬.కుటుంబములో ప్రతీ వ్యక్తీ తనవంతు బాద్యతలు,కర్తవ్యాలు నిర్వర్తించాలనే సత్యాన్ని మరవడం.
౭.కుటుంబములో తోటివారి భావాలను తేలికిగా తీసుకొని వారిని చులకనగా మాట్లాడడం .
౮.తనపెత్తనమే చెలామణి కావాలనుకొని మొండిపట్టుదల పట్టడం.
౯.తానూ అనుకొన్నది అనుకొన్నట్లు జరగకపోతే రామరావణ సంగ్రామం తలపించే విధముగా ప్రవర్తించడం .
౧౦.ఇవన్నీ ఒక ఎత్తు. గృహములో ఆద్యాత్మిక వాతావరణం లేకపోవడం,భక్తి భావాలు సన్నగిల్లడం, ధార్మిక చింతన కొరవడడం వంటి అంశాలు ఖచ్చితంగా విపరీతమైన పరిణామాలకు దారితీస్తున్నై .
నిజానికి ఇంట్లో విశాలమైన పడక గదిని, సౌకర్యాలతో కూడిన స్నానపు గదులను,నవీన వసతులతో కూడిన వంట గదులను నిర్మించుకున్టాము.కానీ, ప్రసాంతతను,ఆహ్లాదాన్నిస్పూర్తినివ్వగలిగే పూజామందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాము. ఏదైనా బాధ కలిగినా,మానసికముగా ప్రసాన్తతలోపించినా,ఇబ్బందులు ఎదురైనా,వీటన్నిటిని అధిగమించేందుకు వీలైన పూజా గదిని మన గృహములో ఖచ్చితముగా ఏర్పాటు చేసుకోవాలి.ప్రతీ రోజు నిత్యక్రుత్యలనంతరం శ్రద్దగా ప్రతిఒక్కరూ
పూజా గదిలో వెచ్చించాలి .
స్తోత్ర పారాయణ చేసుకోవడం, భగవంతునికి పుష్పాలను సమర్పించడం, సుగంధభరితమైన ధూపం వేయడం,ఆవు నేటితో కాని, నువ్వులనూనెతో కానీ దీపారాధన చేయడంవలన గృహము లోనూ,కుటుంబ సభ్యులందరి లోను తప్పక మంచి అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సంస్కారాన్ని ఇంటిలో ప్రతి ఒక్కరికి అలవాటు చేయించండి. ఈ అలవాటే క్రమేపీ ఆచారముగా మారుతుంది. తద్వారా ప్రతిగృహము దేవాలయముగాను, అందులోని ప్రతిఒక్కరూ సచేతనమైన దేవతా మూర్తులు కాగలరు .
ఇల్లు అనే తెలుగు పదాన్ని ఆంగ్లములో house అని అంటారు. గృహం అనే పదం సంస్కృత సబ్దమైనప్పతికిని తెలుగులో కూడా వాడుతూ వుంటారు. గృహమనే పదము లో అహం అనే ఉచ్చారణ స్పురిస్తుంది. ఇల్లు అనగానే వస్తువులు, పదార్ధాలు, పరికరాలు మాత్రమె కావు, వ్యక్తులే ప్రధానం.కాబట్టి ఈ ఒక్కరి వ్యక్తిత్వాన్ని కించపరచకుండా ప్రతి ఒక్కరినీ తన మాటలతో, చేతలతో, భావాలతో సమన్వయము చేసుకుంటూ సాగే గృహస్తాశ్రమ విధానం స్వర్గంకన్న ఖచ్చితముగా గొప్పదే.
గృహములోని బంధాలు, భాందవ్యాలు మనం కల్పించుకోన్నవి కావు. అవి పరమాత్మ చే అనుగ్రహింప బడినవి. ఈ లోకంలో నేను ఫలానా వాడి కడుపునా పుట్టాలి ,ఫలానా ఇంట్లో పుట్టాలి అని నిర్నించుకొనే అవకాసము ఏ ఒక్కరికి లేదు. అందుకని ఇది కాకతాళీయముగా జరిగిందని చెప్పలేము. వీటన్నిటి వెనుక బల్లెయమైన కారణముందని విశ్వసించే హిందూ సంస్కృతీ మనది.
*కర్తురాజ్ఞాయా ప్రాప్యతే ఫలం * పర మాత్మ అనుగ్రహం తోనే మన జన్మాంతర ఖర్మలు పరిపక్వమై కార్య రూపాన్ని దాలుస్తున్టై .అందులో భాగమే తల్లి,తండ్రి,భార్య, భర్త,పిల్లలు మొదలగునవ్న్ని .వీటన్నిటిని ఈశ్వర ప్రసాదముగా భావించి పక్షపాత ధోరణిని విడిచి, సమన్వయము చేసుకుంటూ కొనసాగే జీవన విదాన్నానే గృహస్తాశ్రమ ధర్మమంటారు .అట్టి ఈ జీవితాన్ని సమర్దవంతముగా కొనసాగించేందుకు వ్యక్తి తనను తను సమస్కరించుకొంటు గృహములో కూడా మంగళకరమైన వాతావరణాన్ని పెంపొందించే దిసేగా ప్రయత్నించాలి. అందుకై ఈ సూచనలు ఏమాత్రము ఉపయోగపడినా ఉభయత్రా లాభం!సర్వత్రా సౌఖ్యం .

28, ఏప్రిల్ 2010, బుధవారం

కాదేది కలుషితానికి అనర్హం [రక్తనిధిలో రక్తం కలుషితం ]

రాజమండ్రి జాగృతి బ్లడ్ బ్యాంకు నందు తీసుకొన్న రక్తం వలన ఒక నిండు జీవితం తను చేయని పాపానికి బలియ్యింది .
వివరాలలోకి వెడితే ఒక వ్యక్తి ఆక్సిడెంట్ జరిగి హాస్పిటల్ లో జాయిన్ అవ్వగా అతని కి రక్తం అవసరమై బంధువులు జాగృతి బ్లడ్ బ్యాంకు నందు రక్తం తీసుకొని అతనికి అవసరమైన రక్తం ఎక్కించిన తర్వాత మిగిలిన వైద్యానికి అతనికి రక్తపరీక్ష చేసినప్పుడు అతనికి *H I V Positive* గా రిపోర్ట్ వొచ్చింది.అంతవరకూ అతనికి ఎప్పుడు లేనిది ఆవిధముగా వొచ్చేసరికి బంధువులందరూ ఆ బ్లడ్ బ్యాంకు వారిని అడుగగా రక్తం తమవద్ద కొన్నది కాదని వాదించారు .ఇంతలో ఈవిషయం షరా మాములుగా రాజకీయనాయకులకు,పోలీసు వార్కి తెలిసి వారుకూడా అక్కడకు చేరుకొని కల్లెక్టర్కు, DM &HO వార్కి తెలిపి బ్లడ్ బ్యాంకు యజమాని డా .నాగేశ్వర రావు ను అరెస్ట్ చేసి బ్లడ్ బ్యాంకు ను సీజ్ చేసారు. తదుపరి బ్లడ్ ను గవర్నమెంట్ హాస్పిటల్ నందు టెస్ట్ చేయించగా H I V +VE గా నిర్ధారణ జరిగింది .ఆ బ్లడ్ ప్యాకెట్ పై దాత పేరునుబట్టి ఆ దాతను తీసుకువచి బ్లడ్ టెస్ట్ చేయగా అతను H I V +VE గా రుజువు అయ్యింది .దీనిని బట్టి మన బ్లడ్ బ్యాంకు లలో సేకరిస్తున్న రక్తం సరైన పరీక్షలు జరుపకుండగా ,అనుభవములేని ల్యాబ్ టెక్నీషియన్స్ తో సరైన ప్రమాణములు పాటించకుండా నడుపుతున్నట్లు అర్ధముతోంది .వేరే వేరే విషయాలలో ఏదైనా తప్పిదం జరిగితే సరిచేసుకోవచ్చు ,కాని ఇలాంటి విషయంలో బాధితునికి జరిగిన పొరపాటును ఏవిధముగా సవరించగలరు .బ్లడ్ బ్యాంకు యజమాని ఏదో ఒక విధముగా కొన్నల్లకైనా ఈకేసునుంది బయటపడగలదు, లేదా చిన్నపాటి శిక్ష తో విడుదల అవుతాడు .మీరే ఆలోచించండి ఇలాంటి తప్పిదాలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏమిచేయాలో ?

26, ఏప్రిల్ 2010, సోమవారం

ఆటో ప్రయాణం -ప్రమాదాల పరంపర

ప్రతీ రోజు ఉదయాన్నే పేపర్ చూసిన, టీవీ చూసిన మొదటగా మనకు కనిపించే వార్త రక్త సిక్తమైన రహదారులు అంటూ ఫోటోలు తో సహా వార్తలు.ఇందులో ఎక్కువుగా ఆటో ప్రమాదాలే .అసలు ఆటోలో ప్రయాణించడానికి ఇంతమంది అని పర్మిషన్ వుంటుంది .కానీ మనం చూస్తున్న వార్తలో 4 in all అని రాసివున్న ఆటో అక్కడ పడివుంటుంది ,కానీ అక్కడ చనిపొఇన వాళ్ళు కనీసం 8 మంది పైన వుంటారు .అసలు ఆటో కెపాసిటీ కి మించి జనాన్ని ఎక్కిన్చుకొనే ఆటో వారిపైన మన రవాణా శాఖ కానీ పోలీసు వారు కానీ ఎందుకు కేసులు నమోదు చేయటంలేదు .ఆటో డ్రైవర్ కు రెండు ప్రక్కల హేండిల్ కూడా తిప్పలేని పరిస్తితులలో పరయనించడం ఎంత ప్రమాదమో మనం కూడా ఆలోచించాలి. ముందుగా జనం నుండి ఈవిషయమై మార్పు రావాలి. ఏదైనా ఒక స్వచ్చంద సంస్తలు ఈ విషయమై ప్రజలను చైతన్యవంతులను చేయాలి .[పులి రాజా టైపు లో] బ్యాంకులు ,ఫైనాన్సు సంస్తల పుణ్యమాని ప్రతీ గ్రామ గ్రామాన ,ఈ ఆటోలు చీమల బారుల్ల తిరుగు తున్నై ,వాటిని నడిపే వారికి రహదారి నిభందనలపై అవగాహన లేదు .ఆటో ఎక్కడపడితే అక్కడ సదన్ బ్రేక్ వేయడం ,వెనక ఎవరోస్తున్నారో చూడకుండగా కుడి ఎదమలకు త్రిప్పడం .వారి ఇష్టం తాగి ఆటో నడపడం,పెద్ద సౌండ్ తో ఆటోలో స్పీకెర్స్ .వీటికి అడ్డుకట్ట వేసేవారు లేరా ?పూర్వం సిటిబస్ అతి వేగంగా హారను వేసుకుంటూ వోస్తూంటే ఇలానే భయమేసీది ,ఆటోల పుణ్యమాని వాటి సంఖ్య తగ్గింది .మరిప్పుడు ఈ ఆటోలకు ప్రత్యయమానం ఏమిటో దేముడా నీవే చెప్పాలి.

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

అమ్మో ......భగవద్గీత

భగవద్గీత
తెల తెల వార కుండా శీతాకాల చలిలో చల్లటి పిల్ల తెమ్మరలు మంచులో తడిసి పూల సువాసనలు వేదచాల్లుతూ తమతో పాటుగా తీసుకువోచ్చి మన చెవిని చేరవేసిన మన వూరి గుడి పైన ఘంట సాల గారి గ్రామ్ఫోనే రికార్డు.---ఇది పది సంవస్త్సరముల క్రితం మాట .
భగవద్గీత
మరల అదే ఘంటసాల గారి గానం కాని ఎనీ టైం మన ప్రక్క వీధి లోనో,మెయిన్ రోడ్ నుండో స్పీడ్ గా వెళుతూ వినిపిస్తున్న శవ వాహనపు సింబల్ .*ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆద్యాత్మికత పేరుతొ శవ వాహక ఆధారైస్ద్ గా అమర్చిన ఆధునిక సైరన్ .----ఇదీ నేటి దుస్తితి.
శవ వాహనానికి నిర్వాహకులు చేస్తున్నది మంచి పనే ,అలాంటి పరిస్తితులలో వాహనం ఏర్పాటు చేయటం.కాని అదే సమయములో ఎవరివో మనో భావాలు దెబ్బతీయాల ?
*అర్జునునికి భగవానుడు ఉపదీసించిన ఉపనిశిత్తుల సారంసమే భగవద్గీత *
హిందువుల ప్రామాణిక గ్రంధం ,అత్యున్నత న్యాయ స్తానంలో సయతం ఒట్టు వెఇన్చగల భగవత్స్వరూపం .అన్యమతాలు సైతం అండర్ లైన్ చేసుకుంటూ కొన్ని వాక్యాలు ఏరుకుని పట్టుకెళ్ళి తమ ప్రసంగాలలో ఉటంకిస్తున్న అపురూప అద్వైతం .భగవద్గీత నేడిలా..................,
మన చిన్నతనములో ట్రైన్ లో వెడుతుండగా ఏదో తెలియని గ్రామంలో దూరంగా గ్రామఫోన్ రికార్డ్లో భగవద్గీత వినిపిస్తోంటే అక్కడికి దగ్గరలో ఏదో గుడి వుందని,చిన్నాపిల్లల చేత రెండు చేతులు ఎత్తించి దణ్ణం పెట్టించేవారు ఎందఱో తల్లులు. మరిప్పుడో అదే భగవద్గీత మైక్ లో వినపడుతోంటే తమ పిల్లలను అటు చూడకుండగా ముఖానికి తమ చేతులు అడ్డంపెట్టి తల్లులు తమ పిల్లలు అటుప్రక్క చూడకుండగా బలవంతాన తిప్పేస్తుంన్న అమ్మలు అనీక మంది రాజముండ్రి నగర వీధులలో కనిపిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది ?
మరొక చోట మరొక సన్నివేసం
హడావిడిగా పనిలోకి వెడుతున్న కార్మికులు,టీ బ్రేక్ లో టీ త్రాగడానికి వెడుతున్న ఉద్యోగులో ,లేదా క్రికెట్ ఆడుతున్న కుర్రకారు ,ఎవ్వరైనా కాని ఎ సమయములోనైనా కాని భగవద్గీత వినిపించిందంటే తల ప్రక్కకు తిప్పకుండగానే
#ఎవడో టపా కట్టేసాడురా , ఎక్కడో వికెట్ పడిందిరా #
#ఎవరో బాల్చి తన్నేసారురా - ఇల్లాంటి జోకులు వేసుకుంటూ హేళనగా మాట్లాడుకునే పరిస్తితి కల్పించింది ప్రస్తుత పరిస్తితే కాదంటారా ?
మానవ జన్మ తృణ ప్రాయమని దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోమన్నట్లుగా ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే భగవంతుని మీద మనస్సు లగ్నం చెయ్యమని ,ప్రశాంతమైన ఆమనస్సుకు పవిత్రత అద్దమని పూజ్య ఘంటసాల వారు ,తదితరులు ఆ పవిత్ర గ్రంధంలో ముక్యమైన శ్లోకాలను ఏరి గ్రామపోన్ లో బందించి తరతరాలకు అందించారు.కానీ నేడు జరుగుతున్నదేమిటి ?ఇది చూస్తూ ఊరుకోవలసిన్దేనా ?
ఉదయం ౭ గం కూడా నిద్రభంగామైన్దనో ,లేదా తమకు వచ్చిన సెల్ ఫోనులో వాయిస్ సరిగ్గా వినపదలేదనో,పనిగట్టుకుని వొచ్చి గుడిపైన వినపడుతున్న దేముని పాటలు కట్టిన్చీస్తున్న మన హిందూ సోదరులు ఈవిషయం నిర్వాహకుల దృష్టికి తీసుకు వెడతారని నేను అనుకోవటం అత్యాసే నంటార ? ఇస్కాన్ లాంటి బలమైన ఆద్యాత్మిక సంస్టలు పెద్ద వారి దృష్టికి ఈ విషయం తీసుకుని వెళ్లి ప్రత్యామ్నాయం కోసమై ప్రయత్నించాలేర ?అదేమన్న సాద్యం కాని పనా ?---ఆలోచించండి
భగవద్గీతను గానం చేసిన ఆ స్వరం తో ఇకపై ఏరకమైన ప్రేమ గీతాలు పాడనని తన గాత్రసుద్ది తో పవిత్రత అద్దిన ఆ మహానుభావుని ఖంటస్వరంస్మశాన వాటికలో శవ వాహనం పైన రోదిస్తోంది .--మనమేమి చేయ లేమా ?

5, ఏప్రిల్ 2010, సోమవారం

కిడ్నీ ఫంక్షన్ కోసం మందు

నాకు తెలిసి తూర్పు గోదావరి జిల్లా భట్టిలంక అనే వూళ్ళో ఒక సాధారణ రైతు చాలా రోజులనుండి ఇదే ఆవు పంచకంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా మందు ఇస్తున్నట్లు నాకు తెలిసింది .ఇది అందరికి తెలిసేలా బ్లాగ్లో పెడదామనుకున్నాను .కాని అవుపంచాకంతో అనేసరికి నమ్మరనే ఉద్దేశంతో ఇంతవరుకు రాయలేదు .ఈ మందు వాడిన
ఒక ఆసామి రేలేతివే నాకు ఈవిషయమై చెప్పాడు .అతనికి వారానికి నాలుగు సార్లు దయలసిస్ చేయవలసివోస్తే ,ఈ మందు వాడిన తర్వాత రొండు సార్లు దయలసిస్ చేస్తుంటే సరిపోతోందని చెప్పాడు.ఆటను ఇచ్చిన ఫోన్ నం ఫోన్ చేసి తెలుసుకుంటే కేవలం 75\- మందు ఇస్తున్నట్లుగా తెలిసింది.ఇది నాకు తెలిసినవిషయం ఎవరికైనా ఉపయోగ పడుతుందని బ్లాగ్ లో పెట్టాను. మీరు ఎవ్వరైనా వాకబు చేసుకుని ఇష్టముంటే మందు వాడుకోవచ్చు .మందు పరగడపున తీసుకోవాలి ,పేషెంట్ వేల్లనవుసారం లేదు ,ఎవ్వరైనా వివరాలు చెపుతే సరిపోతుంది.
మందు ఇచ్చేవారి వివరములు
తూర్పు గోదావరి జిల్లా రాజోలు లో బస్సు స్టాండు నుండి భట్టిలంక వెళ్ళవచ్చును .
భట్టిలంక వంతెనవడ్డ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇల్లు ,పేరు భైరవ మూర్తి ,ఫోన్ నం.08862-203066

27, ఫిబ్రవరి 2010, శనివారం

కిన్ద్నీ ఫంక్షన్ కోసం మందు [దయలసిస్ రోగులకి]

ఈ రోజు ఒక టీవీ చానల్ లో బెంగుళూరు లో ఆవు పంచకం తో మధు మెహ వ్యడికి మందు కనుగొన్నట్లు చూసాను .
నాకు తెలిసి తూర్పు గోదావరి జిల్లా భట్టిలంక అనే వూళ్ళో ఒక సాధారణ రైతు చాలా రోజులనుండి ఇదే ఆవు పంచకంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా మందు ఇస్తున్నట్లు నాకు తెలిసింది .ఇది అందరికి తెలిసేలా బ్లాగ్లో పెడదామనుకున్నాను .కాని అవుపంచాకంతో అనేసరికి నమ్మరనే ఉద్దేశంతో ఇంతవరుకు రాయలేదు .ఈ మందు వాడిన
ఒక ఆసామి రేలేతివే నాకు ఈవిషయమై చెప్పాడు .అతనికి వారానికి నాలుగు సార్లు దయలసిస్ చేయవలసివోస్తే ,ఈ మందు వాడిన తర్వాత రొండు సార్లు దయలసిస్ చేస్తుంటే సరిపోతోందని చెప్పాడు.ఆటను ఇచ్చిన ఫోన్ నం ఫోన్ చేసి తెలుసుకుంటే కేవలం 75\- మందు ఇస్తున్నట్లుగా తెలిసింది.ఇది నాకు తెలిసినవిషయం ఎవరికైనా ఉపయోగ పడుతుందని బ్లాగ్ లో పెట్టాను. మీరు ఎవ్వరైనా వాకబు చేసుకుని ఇష్టముంటే మందు వాడుకోవచ్చు .మందు పరగడపున తీసుకోవాలి ,పేషెంట్ వేల్లనవుసారం లేదు ,ఎవ్వరైనా వివరాలు చెపుతే సరిపోతుంది.
మందు ఇచ్చేవారి వివరములు
తూర్పు గోదావరి జిల్లా రాజోలు లో బస్సు స్టాండు నుండి భట్టిలంక వెళ్ళవచ్చును .
భట్టిలంక వంతెనవడ్డ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇల్లు ,పేరు భైరవ మూర్తి ,ఫోన్ నం.08862-203066

28, జనవరి 2010, గురువారం

నిండైన సాహితీమూర్తి కి నిలువెత్తు నీరాజనం .

ప్రముఖ సాహితి వేత్త , తెలుగు నేలకు గర్వ కారణం శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి .ఈయన ఆవిర్భావం 23.04.1891 ,
తిరోధానం 25.02.1961 . తెలుగు కధానిక శతజయంతి సందర్భముగా శ్రీ వేదగిరి కమ్యూనికేషన్ హైదరాబాద్ వారి ఆద్యర్యములో 24.01.2010 న రాజమండ్రి పాల్ చౌక్[కోటిపల్లి బస్సు స్టాండ్ సెంటర్ ] లో ఆయన విగ్రహవిస్కరణ జరిగింది . సభలో వక్తలు మాట్లాడుతూ తన కధలతో రాజమండ్రి సంస్కృతిని సుసంపన్నం చేసిన సుబ్రహ్మణ్య శాస్త్రి సాహిత్యం గోదావరి ఉన్నంత కాలం జీవిస్తుంది అన్నారు ,ఆయన రాసిన ఆత్మ బలిదానం మనో విజ్ఞానిక నవల చదివినప్పుడు ఆయన లోని గొప్పదనం బయట పడుతుంది అన్నారు .ఉమ్మడి కుటుంబం లోని ముద్దు ,ముచ్చట్లు ,ఆత్మీయతలు శాస్త్రి కధలలో
కనిపిస్తయన్నారు.

26, జనవరి 2010, మంగళవారం

ఫిలాటిక్ ఎగ్జిబిషన్

భారత తపాలా శాఖ వారి ఆదేశాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో పోస్టల్ డిపార్టుమెంటు వారిచే పిబ్రవరి 12,13,మరియు 14 వ తేదీలలో గేదెల నూకరాజు కల్యానమదపంలో జిల్లా స్థాయి పిలాటాలి ఎగ్జిబిషాన్ జరుపబడుతోంది .ఇందులో పాల్గొనే ఫిలాటలిస్తులకు సీనియర్లకు ,యూత్ గ్రూప్ [16-21] లకు ఆవాహనం పలుకుతోంది .వివరాలను జనవరి 30 వ తేదీ లోపున రాజమండ్రి పోస్టల్ డివిజన్ అధికారి వార్కి తెలియపరచావలసిన్డిగా కోరుతున్నారు .21 సంవస్త్సరముల లోపువార్కి ఎంట్రీ రుసుము లేదు.

13, జనవరి 2010, బుధవారం

సూర్య గ్రహణం 15-01-2010

ఈ సంవస్త్స్తరం పుష్య బహుళ అమావాస్య శుక్రవారం 15-01-2010 వ తేదీన ఉత్తరాషాడ నక్షత్రమందు మద్యాహ్నం సంపూర్ణ సూర్య గ్రహణం పట్టును .రాహుగ్రస్తము, అపస్సవ్య గ్రహణము.స్పర్స కాలము ఉదయం గం .11.38, మద్యాకాలం గం . 01.39, మోక్షకాలం గం.03.20. ఆద్యంత పుణ్య కాలము గం .03-42.
ఈ గ్రహణము ఉత్తరాషాడ నక్షత్రమందు పట్టుతచే ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు [ధనుస్సు ,మకర రాసుల వారు]గ్రహణము చూడ రాదు .నిత్య భోజన ప్రత్యబ్దీకాదులు సుద్ధ మోక్ష కాలము అయ్యిన తరువాత ,బింబ దర్శనము చేసుకుని,స్నానము చేసిన తరువాత ఆచరించవలెను .
గ్రహణములు పట్టు నక్షత్రములవారు ,రాసులవారు గ్రహనానంతరము స్నానము చేసి ,నక్షత్ర జపము ,ఈస్వరాభిషేకము చేఇంచుకొని దోష నివారణకు వారి యొక్క ఆర్ధిక స్తోమతను బట్టి బంగారము, వెండి, బియ్యము, వస్త్రములు, స్వయంపాకము తగిన దక్షినలతో బ్రాహ్మణులకు దానము చేయవలెను .

శుభాకాంక్షలు

తోటి బ్లాగెర్స్ అందరికి నా సంక్రాంతి శుభాకాంక్షలు .
ఈ పండగ మన అందరికి సకల సౌభాగ్యాలు కలుగ చేయాలనీ ,పిల్లాపాపలతో ,సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటూ,క్రొత్తగా ఈ తెలుగు బ్లాగెర్స్ కుటుంబంలో చేరిన నన్ను ఆదరిస్తూ ఆశీర్వదిస్తారని కోరుతూ --మీ మూర్తి

4, జనవరి 2010, సోమవారం

సంక్రాంతి - 1

పండగ దగ్గర గా వొస్తోంది అంటే నాకు నా చిన్న నటి జ్ఞాపకాలు కళ్ళముందు కడులడుతూ వుంటై .చిన్న తనములో ముందు రోజు స్నేహితులు నలుగురు ఒక గంప పట్టుకొని ఎప్పుడెప్పుడు పండగ ?ఈదాడి పండగ ,పండగెండుకొచ్చింది? పప్పులు తినడానికి వొచ్చింది ,అల్లుడు ఎందుకు వొచ్చాడు ? అరిసలు తినడానికి వొచ్చాడు .అంటూ పాడే పాటలు గంపలో పరుగు పరుగున ఇంటిలోనుండి ఒక చెక్కపేడు,రెండు పిడకలు పట్టుకువోచ్చి వేసేవాళ్ళం ,పండగనేల పట్టింది మొదలు బడి నుడి తిరిగొచ్చిభోగి పిదకలకై ఆవుపేడ కోసమై పరుగులు పెట్టేవాళ్ళం . పేడతో చిన్న చిన్న పిడకలు మద్యలో ఒక రంద్రముతో చేసి గోడకు కొట్టేవాళ్ళం . భోగి పీడకలలో మళ్లి తల్లిపిడక[ఇదు రంద్రములతో] అరటిపండు [మూడు రంద్రములతో] చేసేవాళ్ళం. ఈలోపుగా అమ్మవారి ఊరేగింపు వొచ్చేది .అమ్మ ఒక చెంబు లో నీలు అందులో కొంచం పసుపు కలిపి నీళ్ళు, పళ్ళెంలో బియ్యం ,పసుపు ముద్దా ,కుంకం ముద్దా పెట్టి చిల్లర పైసా దక్షిణగా పెట్టి పట్టుకువోచ్చేది .మేము వీధిలో ఎవరి ఇంటిలో ఉంది భోగి పిదకలపై చర్చ చేస్తున్న ,తాయారు చేస్తున్న కానీ అమ్మవారి దప్పుల మోతకు పరుగున వొచ్చి పళ్ళెం ఇవ్వడం కోసమై సిద్ధమయ్యే వాళ్ళం .ఆసాదు కాళ్ళపై నీళ్ళుపోసి బియ్యపు పళ్ళెం చేతికి ఇచ్చి దణ్ణం పెట్టుకుంటే ,ఆసాదు ఒక వేప ఆకూ కొంచెం పసుపు కుంకుమ పళ్ళెంలో వేసి ఇచ్చేవాడు .ఇక చీకటి పడ్డాక అక్క అమ్మ వీధి లో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టె కార్యక్రమం మొదలై వీధి లోఅందరి ముగ్గులు చూసుకుంటూ పోటాపోటిగా సాగుతూ చాల ప్రోడ్డ్డు పోయేది .మేము ఇది చూస్తూ ఒక్కొక్క సారి అరుగు పైనే అలనిద్రలోకి జారేవాళ్ళం.[మిగిలినది సంక్రాంతి - 2 లో ]

సంక్రాంతి -1

ఈ పండగ దగ్గర గా వొస్తోంది అంటే నాకు నా చిన్న నటి జ్ఞాపకాలు కళ్ళముందు కడులడుతూ వుంటై .చిన్న తనములో ముందు రోజు స్నేహితులు నలుగురు ఒక గంప పట్టుకొని ఎప్పుడెప్పుడు పండగ ?ఈదాడి పండగ ,పండగెండుకొచ్చింది? పప్పులు తినడానికి వొచ్చింది ,అల్లుడు ఎందుకు వొచ్చాడు ? అరిసలు తినడానికి వొచ్చాడు .అంటూ పాడే పాటలు ఆ గంపలో పరుగు పరుగున ఇంటిలోనుండి ఒక చెక్కపేడు,రెండు పిడకలు పట్టుకువోచ్చి వేసేవాళ్ళం ,పండగనేల పట్టింది మొదలు బడి నుడి తిరిగొచ్చిభోగి పిదకలకై ఆవుపేడ కోసమై పరుగులు పెట్టేవాళ్ళం .ఆ పేడతో చిన్న చిన్న పిడకలు మద్యలో ఒక రంద్రముతో చేసి గోడకు కొట్టేవాళ్ళం .ఆ భోగి పీడకలలో మళ్లి తల్లిపిడక[ఇదు రంద్రములతో] అరటిపండు [మూడు రంద్రములతో] చేసేవాళ్ళం. ఈలోపుగా అమ్మవారి ఊరేగింపు వొచ్చేది .అమ్మ ఒక చెంబు లో నీలు అందులో కొంచం పసుపు కలిపి నీళ్ళు, పళ్ళెంలో బియ్యం ,పసుపు ముద్దా ,కుంకం ముద్దా పెట్టి చిల్లర పైసా దక్షిణగా పెట్టి పట్టుకువోచ్చేది .మేము వీధిలో ఎవరి ఇంటిలో ఉంది భోగి పిదకలపై చర్చ చేస్తున్న ,తాయారు చేస్తున్న కానీ ఈ అమ్మవారి దప్పుల మోతకు పరుగున వొచ్చి ఆ పళ్ళెం ఇవ్వడం కోసమై సిద్ధమయ్యే వాళ్ళం .ఆసాదు కాళ్ళపై నీళ్ళుపోసి బియ్యపు పళ్ళెం చేతికి ఇచ్చి దణ్ణం పెట్టుకుంటే ,ఆసాదు ఒక వేప ఆకూ కొంచెం పసుపు కుంకుమ పళ్ళెంలో వేసి ఇచ్చేవాడు .ఇక చీకటి పడ్డాక అక్క అమ్మ వీధి లో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టె కార్యక్రమం మొదలై వీధి లోఅందరి ముగ్గులు చూసుకుంటూ పోటాపోటిగా సాగుతూ చాల ప్రోడ్డ్డు పోయేది .మేము ఇది చూస్తూ ఒక్కొక్క సారి అరుగు పైనే అలనిద్రలోకి జారేవాళ్ళం.[మిగిలినది సంక్రాంతి - 2 లో ]

దీవెన!

2010 కి స్వాగతం చెబుతూ మన రాష్ట్రానికి చిదంబరం దీవెన [ ప్రకటన ]

మూడు బందులు
ఆరు ధర్నాలుగా
వర్ధిల్లు

2, జనవరి 2010, శనివారం

పరిష్కారం?

రేపు 5 వ తేదీన జరిగే తెలగాణ మీటింగ్ [న్యూ ఢిల్లీ లో ] కేవలం పార్టీ కి ఇద్దరు చొప్పున రమ్మన్నారు .ఇంతమంది ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తూ,సమర్దిస్తూ వస్తున్న ఈ సమస్య కేవలం ఆ ఇద్దరు ప్రతినిధులు అక్కడ వొప్పుకొని వస్తున్న అంశంను ఏకీభవిస్తారా లేక అల్ పార్టీ మీటింగ్ లో జరిగినట్లుగా ముందు ఒకటి తర్వాత వొకటిగా వుంటుందా ?ఈ సమస్యకు పరిష్కారం ? దేముడా నిన్ను వేడుకోవడం తప్ప ----
కదిలిన ఈ తేనే తుట్టేనుంచి మాకు కమ్మటి తేనెను ఇష్తవో లేక మమ్మలిని తేనే పిండిన తర్వాత తుట్టెల చేస్తావో ?

1, జనవరి 2010, శుక్రవారం

శుభాకాంక్షలు

సహా బ్లాగర్ లు అందరికి
ఈ 2010 మన అందరికి ప్రతి ఇంట వెలుగులు నింపాలని ,మన కుటుంబం[తెలుగు బ్లాగర్] మరింత అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని మ్రోక్కుతూ ---మీ మూర్తి .