HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

28, ఏప్రిల్ 2010, బుధవారం

కాదేది కలుషితానికి అనర్హం [రక్తనిధిలో రక్తం కలుషితం ]

రాజమండ్రి జాగృతి బ్లడ్ బ్యాంకు నందు తీసుకొన్న రక్తం వలన ఒక నిండు జీవితం తను చేయని పాపానికి బలియ్యింది .
వివరాలలోకి వెడితే ఒక వ్యక్తి ఆక్సిడెంట్ జరిగి హాస్పిటల్ లో జాయిన్ అవ్వగా అతని కి రక్తం అవసరమై బంధువులు జాగృతి బ్లడ్ బ్యాంకు నందు రక్తం తీసుకొని అతనికి అవసరమైన రక్తం ఎక్కించిన తర్వాత మిగిలిన వైద్యానికి అతనికి రక్తపరీక్ష చేసినప్పుడు అతనికి *H I V Positive* గా రిపోర్ట్ వొచ్చింది.అంతవరకూ అతనికి ఎప్పుడు లేనిది ఆవిధముగా వొచ్చేసరికి బంధువులందరూ ఆ బ్లడ్ బ్యాంకు వారిని అడుగగా రక్తం తమవద్ద కొన్నది కాదని వాదించారు .ఇంతలో ఈవిషయం షరా మాములుగా రాజకీయనాయకులకు,పోలీసు వార్కి తెలిసి వారుకూడా అక్కడకు చేరుకొని కల్లెక్టర్కు, DM &HO వార్కి తెలిపి బ్లడ్ బ్యాంకు యజమాని డా .నాగేశ్వర రావు ను అరెస్ట్ చేసి బ్లడ్ బ్యాంకు ను సీజ్ చేసారు. తదుపరి బ్లడ్ ను గవర్నమెంట్ హాస్పిటల్ నందు టెస్ట్ చేయించగా H I V +VE గా నిర్ధారణ జరిగింది .ఆ బ్లడ్ ప్యాకెట్ పై దాత పేరునుబట్టి ఆ దాతను తీసుకువచి బ్లడ్ టెస్ట్ చేయగా అతను H I V +VE గా రుజువు అయ్యింది .దీనిని బట్టి మన బ్లడ్ బ్యాంకు లలో సేకరిస్తున్న రక్తం సరైన పరీక్షలు జరుపకుండగా ,అనుభవములేని ల్యాబ్ టెక్నీషియన్స్ తో సరైన ప్రమాణములు పాటించకుండా నడుపుతున్నట్లు అర్ధముతోంది .వేరే వేరే విషయాలలో ఏదైనా తప్పిదం జరిగితే సరిచేసుకోవచ్చు ,కాని ఇలాంటి విషయంలో బాధితునికి జరిగిన పొరపాటును ఏవిధముగా సవరించగలరు .బ్లడ్ బ్యాంకు యజమాని ఏదో ఒక విధముగా కొన్నల్లకైనా ఈకేసునుంది బయటపడగలదు, లేదా చిన్నపాటి శిక్ష తో విడుదల అవుతాడు .మీరే ఆలోచించండి ఇలాంటి తప్పిదాలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏమిచేయాలో ?

26, ఏప్రిల్ 2010, సోమవారం

ఆటో ప్రయాణం -ప్రమాదాల పరంపర

ప్రతీ రోజు ఉదయాన్నే పేపర్ చూసిన, టీవీ చూసిన మొదటగా మనకు కనిపించే వార్త రక్త సిక్తమైన రహదారులు అంటూ ఫోటోలు తో సహా వార్తలు.ఇందులో ఎక్కువుగా ఆటో ప్రమాదాలే .అసలు ఆటోలో ప్రయాణించడానికి ఇంతమంది అని పర్మిషన్ వుంటుంది .కానీ మనం చూస్తున్న వార్తలో 4 in all అని రాసివున్న ఆటో అక్కడ పడివుంటుంది ,కానీ అక్కడ చనిపొఇన వాళ్ళు కనీసం 8 మంది పైన వుంటారు .అసలు ఆటో కెపాసిటీ కి మించి జనాన్ని ఎక్కిన్చుకొనే ఆటో వారిపైన మన రవాణా శాఖ కానీ పోలీసు వారు కానీ ఎందుకు కేసులు నమోదు చేయటంలేదు .ఆటో డ్రైవర్ కు రెండు ప్రక్కల హేండిల్ కూడా తిప్పలేని పరిస్తితులలో పరయనించడం ఎంత ప్రమాదమో మనం కూడా ఆలోచించాలి. ముందుగా జనం నుండి ఈవిషయమై మార్పు రావాలి. ఏదైనా ఒక స్వచ్చంద సంస్తలు ఈ విషయమై ప్రజలను చైతన్యవంతులను చేయాలి .[పులి రాజా టైపు లో] బ్యాంకులు ,ఫైనాన్సు సంస్తల పుణ్యమాని ప్రతీ గ్రామ గ్రామాన ,ఈ ఆటోలు చీమల బారుల్ల తిరుగు తున్నై ,వాటిని నడిపే వారికి రహదారి నిభందనలపై అవగాహన లేదు .ఆటో ఎక్కడపడితే అక్కడ సదన్ బ్రేక్ వేయడం ,వెనక ఎవరోస్తున్నారో చూడకుండగా కుడి ఎదమలకు త్రిప్పడం .వారి ఇష్టం తాగి ఆటో నడపడం,పెద్ద సౌండ్ తో ఆటోలో స్పీకెర్స్ .వీటికి అడ్డుకట్ట వేసేవారు లేరా ?పూర్వం సిటిబస్ అతి వేగంగా హారను వేసుకుంటూ వోస్తూంటే ఇలానే భయమేసీది ,ఆటోల పుణ్యమాని వాటి సంఖ్య తగ్గింది .మరిప్పుడు ఈ ఆటోలకు ప్రత్యయమానం ఏమిటో దేముడా నీవే చెప్పాలి.

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

అమ్మో ......భగవద్గీత

భగవద్గీత
తెల తెల వార కుండా శీతాకాల చలిలో చల్లటి పిల్ల తెమ్మరలు మంచులో తడిసి పూల సువాసనలు వేదచాల్లుతూ తమతో పాటుగా తీసుకువోచ్చి మన చెవిని చేరవేసిన మన వూరి గుడి పైన ఘంట సాల గారి గ్రామ్ఫోనే రికార్డు.---ఇది పది సంవస్త్సరముల క్రితం మాట .
భగవద్గీత
మరల అదే ఘంటసాల గారి గానం కాని ఎనీ టైం మన ప్రక్క వీధి లోనో,మెయిన్ రోడ్ నుండో స్పీడ్ గా వెళుతూ వినిపిస్తున్న శవ వాహనపు సింబల్ .*ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆద్యాత్మికత పేరుతొ శవ వాహక ఆధారైస్ద్ గా అమర్చిన ఆధునిక సైరన్ .----ఇదీ నేటి దుస్తితి.
శవ వాహనానికి నిర్వాహకులు చేస్తున్నది మంచి పనే ,అలాంటి పరిస్తితులలో వాహనం ఏర్పాటు చేయటం.కాని అదే సమయములో ఎవరివో మనో భావాలు దెబ్బతీయాల ?
*అర్జునునికి భగవానుడు ఉపదీసించిన ఉపనిశిత్తుల సారంసమే భగవద్గీత *
హిందువుల ప్రామాణిక గ్రంధం ,అత్యున్నత న్యాయ స్తానంలో సయతం ఒట్టు వెఇన్చగల భగవత్స్వరూపం .అన్యమతాలు సైతం అండర్ లైన్ చేసుకుంటూ కొన్ని వాక్యాలు ఏరుకుని పట్టుకెళ్ళి తమ ప్రసంగాలలో ఉటంకిస్తున్న అపురూప అద్వైతం .భగవద్గీత నేడిలా..................,
మన చిన్నతనములో ట్రైన్ లో వెడుతుండగా ఏదో తెలియని గ్రామంలో దూరంగా గ్రామఫోన్ రికార్డ్లో భగవద్గీత వినిపిస్తోంటే అక్కడికి దగ్గరలో ఏదో గుడి వుందని,చిన్నాపిల్లల చేత రెండు చేతులు ఎత్తించి దణ్ణం పెట్టించేవారు ఎందఱో తల్లులు. మరిప్పుడో అదే భగవద్గీత మైక్ లో వినపడుతోంటే తమ పిల్లలను అటు చూడకుండగా ముఖానికి తమ చేతులు అడ్డంపెట్టి తల్లులు తమ పిల్లలు అటుప్రక్క చూడకుండగా బలవంతాన తిప్పేస్తుంన్న అమ్మలు అనీక మంది రాజముండ్రి నగర వీధులలో కనిపిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది ?
మరొక చోట మరొక సన్నివేసం
హడావిడిగా పనిలోకి వెడుతున్న కార్మికులు,టీ బ్రేక్ లో టీ త్రాగడానికి వెడుతున్న ఉద్యోగులో ,లేదా క్రికెట్ ఆడుతున్న కుర్రకారు ,ఎవ్వరైనా కాని ఎ సమయములోనైనా కాని భగవద్గీత వినిపించిందంటే తల ప్రక్కకు తిప్పకుండగానే
#ఎవడో టపా కట్టేసాడురా , ఎక్కడో వికెట్ పడిందిరా #
#ఎవరో బాల్చి తన్నేసారురా - ఇల్లాంటి జోకులు వేసుకుంటూ హేళనగా మాట్లాడుకునే పరిస్తితి కల్పించింది ప్రస్తుత పరిస్తితే కాదంటారా ?
మానవ జన్మ తృణ ప్రాయమని దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోమన్నట్లుగా ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే భగవంతుని మీద మనస్సు లగ్నం చెయ్యమని ,ప్రశాంతమైన ఆమనస్సుకు పవిత్రత అద్దమని పూజ్య ఘంటసాల వారు ,తదితరులు ఆ పవిత్ర గ్రంధంలో ముక్యమైన శ్లోకాలను ఏరి గ్రామపోన్ లో బందించి తరతరాలకు అందించారు.కానీ నేడు జరుగుతున్నదేమిటి ?ఇది చూస్తూ ఊరుకోవలసిన్దేనా ?
ఉదయం ౭ గం కూడా నిద్రభంగామైన్దనో ,లేదా తమకు వచ్చిన సెల్ ఫోనులో వాయిస్ సరిగ్గా వినపదలేదనో,పనిగట్టుకుని వొచ్చి గుడిపైన వినపడుతున్న దేముని పాటలు కట్టిన్చీస్తున్న మన హిందూ సోదరులు ఈవిషయం నిర్వాహకుల దృష్టికి తీసుకు వెడతారని నేను అనుకోవటం అత్యాసే నంటార ? ఇస్కాన్ లాంటి బలమైన ఆద్యాత్మిక సంస్టలు పెద్ద వారి దృష్టికి ఈ విషయం తీసుకుని వెళ్లి ప్రత్యామ్నాయం కోసమై ప్రయత్నించాలేర ?అదేమన్న సాద్యం కాని పనా ?---ఆలోచించండి
భగవద్గీతను గానం చేసిన ఆ స్వరం తో ఇకపై ఏరకమైన ప్రేమ గీతాలు పాడనని తన గాత్రసుద్ది తో పవిత్రత అద్దిన ఆ మహానుభావుని ఖంటస్వరంస్మశాన వాటికలో శవ వాహనం పైన రోదిస్తోంది .--మనమేమి చేయ లేమా ?

5, ఏప్రిల్ 2010, సోమవారం

కిడ్నీ ఫంక్షన్ కోసం మందు

నాకు తెలిసి తూర్పు గోదావరి జిల్లా భట్టిలంక అనే వూళ్ళో ఒక సాధారణ రైతు చాలా రోజులనుండి ఇదే ఆవు పంచకంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా మందు ఇస్తున్నట్లు నాకు తెలిసింది .ఇది అందరికి తెలిసేలా బ్లాగ్లో పెడదామనుకున్నాను .కాని అవుపంచాకంతో అనేసరికి నమ్మరనే ఉద్దేశంతో ఇంతవరుకు రాయలేదు .ఈ మందు వాడిన
ఒక ఆసామి రేలేతివే నాకు ఈవిషయమై చెప్పాడు .అతనికి వారానికి నాలుగు సార్లు దయలసిస్ చేయవలసివోస్తే ,ఈ మందు వాడిన తర్వాత రొండు సార్లు దయలసిస్ చేస్తుంటే సరిపోతోందని చెప్పాడు.ఆటను ఇచ్చిన ఫోన్ నం ఫోన్ చేసి తెలుసుకుంటే కేవలం 75\- మందు ఇస్తున్నట్లుగా తెలిసింది.ఇది నాకు తెలిసినవిషయం ఎవరికైనా ఉపయోగ పడుతుందని బ్లాగ్ లో పెట్టాను. మీరు ఎవ్వరైనా వాకబు చేసుకుని ఇష్టముంటే మందు వాడుకోవచ్చు .మందు పరగడపున తీసుకోవాలి ,పేషెంట్ వేల్లనవుసారం లేదు ,ఎవ్వరైనా వివరాలు చెపుతే సరిపోతుంది.
మందు ఇచ్చేవారి వివరములు
తూర్పు గోదావరి జిల్లా రాజోలు లో బస్సు స్టాండు నుండి భట్టిలంక వెళ్ళవచ్చును .
భట్టిలంక వంతెనవడ్డ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇల్లు ,పేరు భైరవ మూర్తి ,ఫోన్ నం.08862-203066