HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "
telugu one .com nundi sekarana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
telugu one .com nundi sekarana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జనవరి 2012, సోమవారం

mopideviputta

సంతానాన్ని ఇచ్చే మోపిదేవి పుట్ట
(Divine Mopidevi Putta)

మోపిదేవి దగ్గర్లో ఉన్న మాలపల్లిలో ఓ పాముపుట్ట ఉంది. ఇందులో ఉన్న నాగుపాము దివ్యమైంది అని ప్రజల ప్రగాఢ నమ్మకం. ఈ పుట్టలో పాలు పోయడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. ముఖ్యంగా పిల్లలు పుట్టనివాళ్ళు ఈ మోపిదేవి సమీపంలో ఉన్న మాలపల్లి పుట్టకు మొక్కుకుంటారు. అలా మొక్కుకున్నవారికి ఏడాదిలో పిల్లలు పుట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఉన్న మోపిదేవిని పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఈ ఊరికి సంబంధించి స్థల పురాణాలు వ్యాప్తిలో ఉన్నాయి. అందుకు నిదర్శనంగా ఈ గుడిని దర్శించుకున్న వారి కోరికలు నెరవేరుతాయి. సంతానం లేదని బాధపడుతూ ఇక్కడి మాలపల్లి పుట్టకు మొక్కుకున్న ఎన్నో జంటలు ఏడాది తిరక్కుండా బిడ్డకు జన్మనిచ్చిన ఉదాహరణలు ఉన్నాయి.

నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి, నాగపంచమి లాంటి విశేష దినాల్లో మోపిదేవి పరిసర ప్రాంతాల్లో నాగుపాములు సంచరిస్తుంటాయి. అవి ఎవరికీ ఎలాంటి హాని చేయవు. ఇలా కనిపించే నాగుపాములు విశేష దైవిక శక్తి గలవని స్పష్టం అయ్యేలా అద్బుత సువాసనలు వెదజల్లుతాయి.

సంతానం లేనివారు మాత్రమే కాదు, సమయానికి పెళ్ళి కానివారు, చెవిలో చీము కారుతున్నవారు, పీడకలలతో భయపడుతున్నవారు - ఇలా ఎందరో నాగదోషం ఉన్నవారు మోపిదేవి పుట్టకు మొక్కుకుని, దోష నివారణ చేసుకుని సంతోషంగా తిరిగి వెళ్తుంటారు.

mopidevi putta and ch

10, నవంబర్ 2011, గురువారం

కార్తీకంలో పసందైన వనభోజనాలు

కార్తీకంలో పసందైన వనభోజనాలు

Vanabhojanam in Karthika Masam




కార్తీకమాసం అనగానే వనభోజనాల హడావిడి మొదలౌతుంది. ఊరూవాడా సందడిగా ఉంటుంది. వనభోజనాల ప్రసక్తి అనేక ధార్మిక గ్రంధాల్లో ఉంది. ముఖ్యంగా ''కార్తీకపురాణం''లో కార్తీక పౌర్ణమినాడు నైమిశారణ్యంలో మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు లిఖితమైంది. ఉసిరిచెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి, ఉసిరికలతో హరిని పూజించి, గోవింద నామస్మరణ చేస్తూ షోడశోపచారాలతో పూజించి ఆనక వనభోజనాలు చేశారు.




అలా పూర్వం మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాలు ఇప్పటికీ ఏర్పాటు చేసుకుంటున్నాం. నలుగురితో కలిసి ఆనందిస్తున్నాం. ఇంతకీ కార్తీక వనభోజనాలు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం.




కార్తీకమాసం అంటే వర్షాకాలం తర్వాత వస్తుంది. అంటే అప్పటిదాకా వానలు పడి చిత్తడిగా ఉన్న భూములు పొడివారతాయి. అటు వానలు, ఇటు ఎండలు లేకుండా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో నాలుగ్గోడల మధ్య కాకుండా వనంలో అందునా ఔషధ ప్రాయమైన ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది. వీలైనంతవరకూ వనభోజనాలు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారాల్లో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. వృత్తి ఉద్యోగాలతో కొందరికి తీరుబాటు దొరకని మాటా నిజమే. అలా కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాల్లో వీలు కుదరని పక్షంలో కార్తీకమాసంలో ఏదో ఒక రోజు పెట్టుకోవచ్చు.

వనభోజనం పేరుతో ఇంట్లో కాకుండా ఎక్కడో ఒకచోట భోజనం చేయడం అనుకుని కొందరు హోటల్సు, రిసార్ట్స్ రిజర్వ్ చేయించుకుంటున్నారు. అలా చేస్తే అది వనభోజనం అనిపించుకోదు. ఏదో మార్పు కోసం సరదాగా తినడం అవుతుంది. మన పెద్దలు ఉద్దేశించిన ప్రకారం కార్తీక వనభోజనానికి ఉసిరిచెట్టు ఉన్న తోట లేదా ఉద్యానవనాన్ని ఎంచుకోవాలి. అక్కడ ఉసిరిచెట్టు (A tree with acid fruit used for pickles. Phyllanthus Emblica; Emblic myrobalan ) కింద భోజనం చేయాలి. కార్తీక దామోదరుడు అని పిలుచుకునే శ్రీహరి విగ్రహం లేదా ప్రతిమను ఉసిరిచెట్టు కింద ఉంచి, పూజ చేసి, ఆనక వనభోజనాలు చేయాలి.




బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు, ఇరుగుపొరుగువారు, ఒక ఊరివారు - ఇలా రకరకాలుగా కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పదార్ధం తయారుచేసి తీసుకురావడం ఒక పద్ధతి కాగా, అందరూ తలా ఇంత అని డబ్బు చెల్లించి, కేటరింగ్ చెప్పడం మరో పద్ధతి. మొత్తానికి మామూలు కూరలు, పచ్చళ్ళతోబాటు గోంగూర పచ్చడి, ఉలవచారు, పులిహోర, బొబ్బట్లు, గారెలు, పూర్ణాలు లాంటి ప్రత్యేక వంటకాలతో ఆహా అనిపించే రుచికరమైన భోజనం చేయడం ఆనవాయితీ. వనభోజనానికి ముందు వెనుక రోజూవారి రొటీన్ కు భిన్నంగా అందరూ ఆటపాటలతో హాయిగా, ఆనందంగా గడుపుతారు.




మనదేశంలోనే కాకుండా ప్రవాసాంధ్రులు కూడా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకుని ఆనందిస్తున్నారు. కేవలం ఆంధ్రులే కాదు తమిళులు తదితర దక్షిణభారతీయులు వనభోజన మహోత్సవాలు జరుపుకుంటున్నారు.




కార్తీక వనభోజనాలు స్నేహాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయి. పరస్పరం ఆహార పదార్థాలు పంచుకు తినడంవల్ల భిన్న రుచులు అనుభూతికి రావడమే కాకుండా నచ్చినవాటిని నేర్చుకోడానికి అవకాశం లభిస్తుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే చిరాకులు, పరాకులకు దూరంగా అందరూ కలిసి వేడుక చేసుకోవడం వల్ల వత్తిళ్ళు, వేదనలు తీరతాయి. వనభోజనాలను పెద్దల కంటే పిల్లలు మరీమరీ ఆనందిస్తారు.




Vanabhojanam in Karthika Masam, Karthika Vanabhojanam at acid fruits tree or Usiri chettu, Karthika Vanabhojanam Hindu ritual, Vanabhojanam sharing food and playing games

15, ఆగస్టు 2011, సోమవారం

భైరవకోన పార్వతీదేవి గుడి

భైరవకోన పార్వతీదేవి గుడి

(Bhairavakona Parvati Devi Temple)

అమ్మవారి దేవాలయం ఎక్కడ కొలువైనా అది భక్తులకు పరవశాన్ని ఇస్తుంది. దివ్యశక్తి శోభిస్తూ కళకళలాడుతుంది. ప్రకాశం జిల్లా కొత్తపల్లి దగ్గర్లోని పార్వతీదేవి ఆలయం కూడా అంతే. సరిగ్గా చెప్పాలంటే, పార్వతీదేవి దేవాలయం కొత్తపల్లికి దగ్గర్లో, భైరవకోన అడవుల్లో ఉంది. ఈ గుడి అడవుల్లో ఉండటాన ప్రతిరోజూ కాకుండా, ప్రతి శుక్రవారం అర్చిస్తారు. అలాగే, పండుగలు, పర్వదినాలు లాంటి విశేష దినాల్లో ఉత్సవాలు జరుపుతారు.

ప్రకాశం భైరవకోన పార్వతీదేవి ఆలయం కొత్త పాతల మేలు కలయిక అంటే బాగుంటుంది. ఎందుకంటే, ఈ గుడి ప్రాచీనమైనది కాదు, ఇటీవలి కాలంలో నిర్మించిందే. కానీ, ఆలలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం మాత్రం ప్రాచీనమైంది. భైరవకోన అరణ్యంలో కొండలున్నాయి. ఆ కొండ గుహల్లో లభించిన పార్వతీదేవి శిల్పం ఈ గుడిలో స్థాపించడాన ఇది విశిష్టతను సంతరించుకుంది.

స్థల పురాణాన్ని అనుసరించి, ప్రకాశం భైరవకోన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లికి సమీపంలో ఉన్న అడవిలో కొండలు, కోనలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా! అందులో ఓ కొండ గుహలో భైరవ శిల్పం ఉంది. దానివల్లే ఈ కొనకు భైరవకోన అనే పేరు వచ్చిందట. మరో కథనాన్ని అనుసరించి, పూర్వం భైరవుడు అనే రుషి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునేవాడట. ఆ రుషి పేరు మీదనే వనానికి భైరవవనం అనే పేరు వచ్చింది అంటారు. భైరవ రుషి, తన తపశ్శక్తితోఒక వ్యక్తికి దివ్యశక్తిని ప్రసాదించి, ఆ కొండల్లో అనేక అద్భుత శిల్పాలను, గుహాలయాలను నిర్మింప చేశాడట. మహర్షి తపస్సు చేసిన ప్రాంతం గనుక ఈ పరిసరాలు పునీతమయ్యాయి.

అమ్మవారి దేవాలయంతో పవిత్ర స్థలంగా భావించే భైరవకోన చూడ చక్కని ప్రదేశం. ఇక్కడి గుహాలయాలు ప్రాచీన వైభవాన్ని చాటే కళా నిలయాలు. ఒక గుహలోని శివుని విగ్రహం వెనుక చెక్కిన పార్వతిని భక్తిశ్రద్ధలతో ఆరాచిన్చేవారట. ఒకసారి భైరవకోన గుహాలయాలను దర్శించడానికి వచ్చిన కంచి కామకోటి పీఠాధిపతి శివుని ప్రతిమ వెనుక కనిపిస్తున్న విగ్రహం అమ్మవారిది కాదని తేల్చి చెప్పారు. కనుక ఆ శిల్పాన్ని పార్వతీదేవిగా ఆరాధించడం సముచితం కాదని చెప్పారు. దాంతో ఆ ప్రాంతీయులు వెంటనే విరాళాలు సేకరించి, తమ ఆరాధ్యదైవమైన పార్వతీదేవికి ఒక ఆలయం నిర్మించారు.

Share

పర్ణశాల రామాలయం

పర్ణశాల రామాలయం

(Parnasala, shoka Ramalaya)

భద్రాచల కోదండ రామాలయం జగత్ ప్రసిద్ధం. ఆ ఆలయ రీత్యా భద్రాచలాన్ని, మొత్తం ఖమ్మం జిల్లానీ పరమ పవిత్రంగా భావిస్తారు. అలాగే పర్ణశాల రామాలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.

పర్ణశాల రామాలయం ఖమ్మం జిల్లా, భద్రాచలానికి కొద్ది దూరంలో పర్ణశాలలో ఉంది. శ్రీరాముడు, వనవాస కాలంలో ఇక్కడ పర్ణశాల వేసుకుని నివాసమున్నట్లు వాల్మీకి రామాయణం, ఇంకా అనేక పురాణ కథలు వివరిస్తున్నాయి.. సీతమ్మ మాయలేడిని చూసి వ్యామోహపడటం, రావణాసురుడు, సీతమ్మను ఎత్తుకుపోయిన ప్రదేశమూ ఇదే. రావణాసురుని రథ చక్రాల గుర్తు ఉన్న గుట్ట కూడా ఇక్కడుంది. దాన్ని రావణ గుట్ట అంటారు. ఇలాంటి ఎన్నో నిదర్శనాలు ఇక్కడ సీతారాముల నివాసాన్ని ధృవీకరిస్తూ ఇప్పటికీ కనిపిస్తాయి. శ్రీరాముడు పర్ణశాల వేసుకుని నివాసమున్న ప్రదేశం కనుక ఈ ఊరికి పర్ణశాల అనే పేరు వచ్చింది.

పర్ణశాలలో వెలసిన రామాలయాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు నిత్యం వస్తుంటారు. ఇది చాలా ప్రాచీన దేవాలయం. నిండుగా ప్రవహించే గోదావరి తీరంలో ఉన్న ఈ గుడిలో అడుగు పెడితే చాలు మహా ప్రశాంతంగా ఉంటుంది.ఒకవైపు నది, ఇంకోవైపు కొండలతో ఈ ఊరు సౌందర్యానికి ప్రతీకలా ఉంటుంది. ప్రకృతి కాంత పరవశిస్తూ ఇక్కడ ఒదిగిపోయినట్లుగా ఉంటుంది.

పర్ణశాల దేవాలయానికి కొద్ది దూరంలో సీతమ్మ వాగు పేరుతో ఒక కొండవాగు ఉంది. ఆ వాగులో సీతమ్మ స్నానం చేసేదని, అందుకే దానికి సీతమ్మ వాగు అనే పేరు వచ్చిందని అంటారు. వాగు పక్కనే ఉన్న కొండ చరియలు అనేక రంగులతో కళాత్మకంగా ఉంటాయి. సీతమ్మవారు అక్కడ పసుపు కుంకుమల కోసం కొన్ని రాళ్ళను వాడేదని, అందుకే ఆ రంగు రంగుల కొండ రాళ్ళు మరింత శోభను సంతరించుకున్నాయని అంటారు. సీతమ్మ, రామయ్యలు తిరిగిన ఈ ప్రదేశాన్ని చూట్టానికి దేశం నలుమూలల నుండీ భక్తులు విస్తారంగా వస్తుంటారు.

సీతమ్మ దుస్తులు ఆరబెట్టుకున్న చోటు, నగలు ఉంచిన ప్రదేశం, పసుపు కుంకుమలకు ఉపయోగించిన రాళ్ళు అంటూ ఒక్కో రాయినీ, ప్రదేశాన్నీ స్థానికులు చూపిస్తుంటే భక్తుల సంతోషానికి అవధులు ఉండవు.

12, ఆగస్టు 2011, శుక్రవారం

ఔషధంగా పనిచేసే 16 రకాల పూవులు

ఔషధంగా పనిచేసే 16 రకాల పూవులు

(16 Medicinal Flowers)

దేవతార్చనలో పూవులు ప్రధాన పాత్ర వహిస్తాయి. పూజకు ఉపయోగించే సుమాల్లో 16 రకాల పుష్పాలు, ఆరోగ్యాన్ని సంరక్షించడంలోనూ దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఈ 16 రకాల పూలు విశిష్టమైనవని తెలుసు కానీ, వీటిల్లో ఔషధ లక్షణాలు ఉన్నాయని మనలో చాలామందికి తెలీదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.మల్లెపూలు పరిమళభరితమైన మల్లెపూలు శాస్త్రీయంగా కూడా చాలా ఉత్తమమైనవి. కంటి జబ్బులను తగ్గిస్తాయి. రక్తదోషాన్ని నివారిస్తాయి. వాత గుణాన్ని తగ్గిస్తాయి.

2. సన్నజాజి శరీర తాపాన్ని పోగొడతాయి. త్రిదోషాలను నివారిస్తాయి. కంటి జబ్బులను హరిస్తాయి. మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి.

3.విరజాజి వాతాన్ని హరిస్తాయి. కఫాన్ని తగ్గిస్తాయి. శరీర భారాన్ని తగ్గించి, తెలికపడేలా చేస్తాయి. ముఖంలో తేజస్సును పెంచుతాయి.

4.చేమంతి చలువ చేస్తాయి. అతి వేడిని, లేదా, అతి చల్లదనాన్ని తగ్గించి, సమశీతోష్ణతను కలిగిస్తాయి. క్రిమి కీటకాల వల్ల వచ్చే సమస్త జ్వరాలు, రోగాలనూ, నరాల బలహీనతను హరిస్తాయి. జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా చేస్తాయి.

5. చెంగల్వ శ్రమ, అలసటలను పోగొడతాయి. రక్త, వాత, పిత్త దోషాలను నివారిస్తాయి. కంటి జబ్బులను తగ్గించి, కళ్ళకు చలవ చేస్తాయి.

6. కమలం కంటి జబ్బులను తగ్గిస్తాయి. శరీరంలో ఉన్న ఉష్ణాన్ని హరిస్తాయి. గర్భస్రావానికి కమలాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

7.తామర దాహంతో నాలుక పిడచవారే లక్షణాన్ని తామరపూలు వెంటనే తగ్గిస్తాయి. రక్త, పిత్త, వాత దోషాలను హరిస్తాయి. శరీరానికి దివ్య తేజస్సును ఇస్తాయి.

8. మరువం మరువపు పరిమళం మనసుకు హాయి కలిగించి సేద తీరుస్తుంది. వాత దోషాలను తగ్గిస్తుంది. మరువం ఆకుల రసం తీసి చెవిలో పోస్తే చెవి పోటు, చీము కారడం లాంటి అనారోగ్యాలు తగ్గుతాయి.

9. నందివర్ధనం కళ్ళు ఎర్రగా అవడం, కళ్ళ మంటలు లాంటివి తగ్గించి, కంటికి చలవ చేస్తాయి. తలనొప్పిని తగ్గిస్తాయి. రక్త దోషాలను నివారిస్తాయి.

10.సంపెంగ శరీరాన్ని సమమైన ఉష్ణోగ్రతలో ఉంచుతాయి. కఫం తగ్గుతుంది. రక్త, పిత్త దోషాలు హరిస్తాయి. మూత్రపిండాల్లో చోటుచేసుకునే అపసవ్యతలను సంపెంగలు దివ్యంగా తగ్గిస్తాయి.

11.మొగలి మొగలిపూలు శ్లేష్మాలను, ఉష్ణ ప్రకోపాలను, అన్ని వాతాలను హరిస్తాయి. ఎండిన మొగలి రేకులతో పొగ పెట్టుకుని పీల్చినట్లయితే ఉబ్బసం తగ్గుతుంది.

12.పారిజాతం మధుమేహ వ్యాధిని నివారిస్తాయి. శరీర వాపును తగ్గిస్తాయి. క్రిమి సంహారిణిగా పనిచేస్తాయి. వేడిని, వాతాన్ని, కఫాన్ని తగ్గిస్తాయి.

13. ధవనం గుండె జబ్బులకు ధవనం ఔషధంలా పనిచేస్తుంది. వాతం, కఫం, తగ్గుతాయి. చర్మ వ్యాధులను నివారిస్తుంది. ఆఖరికి మశూచిని కూడా పోగొడుతుంది.

14.మాధవీలత గాయాలు, వ్రణాలను తగ్గిస్తుంది. చర్మ వ్యాధులు తగ్గుతాయి. పిత్త, వాత రోగాలు హరిస్తాయి. శ్వాస సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి.

15.మందారం కురులకు దివ్య ఔషధం మందారం. చుండ్రు, పేను కొరుకుడు, జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు, జుట్టు నలుపు రంగు తగ్గడం, వెంట్రుకలు చిట్లడం లాంటివాటిని మందార తగ్గిస్తుంది. చర్మ వ్యాధులు, మూత్ర సంబంధ జబ్బులు, మంటలు, నొప్పులు, పోట్లు, రుతుక్రమ అనారోగ్యాలు మొదలైనవి మందారతో నయమౌతాయి.

16.పొద్దుతిరుగుడు దగ్గును, చర్మ వ్యాధులను నివారిస్తుంది. క్షయ వ్యాధి కూడా తగ్గుతుంది.

శుభ కార్యాల్లో పసుపు వస్త్రాలు ఎందుకు?

శుభ కార్యాల్లో పసుపు వస్త్రాలు ఎందుకు? (Purpose of Yellow Clothes)....

శుభ కార్యాల్లో పసుపు వస్త్రాలు ఎందుకు?

(Purpose of Yellow Clothes)

హిందువుల పూజాది కార్యక్రమాల్లో, పెళ్ళిళ్ళు ఇతర శుభ కార్యాల్లో పసుపు బట్టలకు చాలా ప్రాధాన్యత ఉంది. హోమం పూర్తయిన తర్వాత కృష్ణాజినపు ముక్క, మోదుగు చేతి కర్ర, మౌంజిలతో బాటు పీతవస్త్రం ధరించాల్సి ఉంటుంది. కానీ, ఎందుకు, ఏమిటి అనేది మాత్రం చాలామందికి తెలీదు. అసలు పీతవస్త్రం ఎందుకు ధరిస్తారో, పసుపు రంగులో ఉన్న గొప్పతనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపులో క్రిమి నాశక గుణం ఉంది. అందుకే మనం పసుపును ఏదో రూపంలో ఉపయోగిస్తుంటాం. గడపకు పసుపు రాయడంలో కళాత్మకత మాత్రమే పరమార్థం కాదు. చీమలు, ఇతర సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయనే ఆలోచతో ఈ ఆచారం బయల్దేరింది. అలాగే కూరల్లో పసుపు వేయడంవల్ల ఆకర్షణీయమైన రంగు రావడమే కాకుండా ఆరోగ్యానికీ మంచిది. స్నానం చేసేముందు ముఖానికి, వంటికి పసుపు రాసుకుంటారు. ఇలా చేయడంవల్ల శరీర ఛాయ పెరుగుతుందని, అనేక రుగ్మతలు తగ్గుతాయని, చర్మ వ్యాధుల్లాంటివి రావని పెద్దలు చెప్తారు.

శ్రీచూర్ణం, కుంకుమల్లో కూడా పసుపు ఉంది. ముగ్గుల్లో పసుపు జల్లుతాం. ఆయుర్వేద వైద్యంలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు. తులసి మొక్కకు పసుపు రాస్తాం. హిందూ సంస్కృతిలో పసుపు వాడకం ఒక అలవాటుగా, ఆచారంగా ఉంది. దీన్ని మంగళప్రదమైన ద్రవ్యంగా వాడుతున్నాం.

పసుపు చర్మ వ్యాధులను నయం చేస్తుంది. అలాగే, చర్మ రోగాల కారణంగా వచ్చే ఇతర రుగ్మతలను కూడా తగ్గిస్తుంది. పరిణామశూల లాంటి ఇబ్బందికరమైన వ్యాధులను నయం చేస్తుంది. పైకి కనిపించే జబ్బులను, కనపడకుండా బాధ కలిగించే వ్యాధులను కూడా పసుపు నివారిస్తుంది.

పసుపురంగులో ఒక వింత ఆకర్షణ ఉంది. ఈ రంగు దుస్తులు ధరించడంవల్ల శరీర వర్చస్సు పెరుగుతుంది. దాతో పసుపు బట్టలు వేసుకున్నవారిపట్ల ఎదుటివికి ఒకవిధమైన సద్భావం కలుగుతుంది. పసుపు రంగు నరాలను కూడా ఉత్తేజపరుస్తుంది.

మానవ శరీరం పంచభూతాల సమ్మేళనం. అనుక్షణం నవగ్రహాల ప్రభావం మనమీద పడుతుంటుంది. పసుపురంగుకు పంచభూతాలు, నవగ్రహాలను అనుకూలంగా మార్చే శక్తి ఉంది. అందుకే మహర్షులు ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకునేలా ఆచారాలను ప్రబోధించారు. తపస్వుల అనుభవ జ్ఞానంతో అంకురించినవే వివిధ ఆచారాలు. వాటిని మనం అనుసరిస్తున్నాం. ఇప్పుడిప్పుడు రంగుల చికిత్స లేదా కలర్ థెరపీ అమల్లోకి వస్తోంది. కానీ మన మహర్షులు ఈ జ్ఞానామృతాన్ని ఏనాడో బోధించారు.

పూర్వం విద్యార్థులు గురుకులానికి వెళ్ళి చదువుకునేవారు. అక్కడ అనేకమంది కలిసి ఉంటారు కనుక ఎవరికైనా వ్యాధులు ఉంటే, ఇతరులకు సోకే ఇబ్బంది ఉందని, పీత వస్త్ర ధారణ చేసేవారు. అలా విద్యాభ్యాసం చేసేంతకాలం పీత వస్త్రాలు మాత్రమే ధరించేవారు.

హిందూ సంప్రదాయాన్ని అనుసరించి, పెళ్ళిలో వధూవరులు పసుపుబట్టలు ధరిస్తారు. అలాగే పెళ్ళికూతురి తలపై పసుపు అద్దిన చట్రం ఉంచుతారు. వధువు అత్తగారిల్లు చేరేవరకూ ఆ చట్రం అలాగే ఉంటుంది. ఆంగ్లేయుల పరిపాలన మొదలైన తర్వాత వధూవరులు పసుపు బట్టలే ధరించాలి అనే నియమం సడలినప్పటికీ, తలంబ్రాలు పోసుకునే సమయంలో పసుపు అద్దిన వస్త్రాలనే ధరిస్తున్నారు. అలాగే, తలంబ్రాలు పడటంవల్ల కూడా అవి మరింత పచ్చగా తయారవుతాయి.

26, జులై 2011, మంగళవారం

ఆదివారంప్రత్యేకత ఏమిటి?

ఆదివారంప్రత్యేకత ఏమిటి?

(Speciality of Sunday)

సూర్యుణ్ణి గ్రహరాజు లేదా గ్రహాలకి అధిపతి అంటాం. ఆ సంగతి అలా ఉంచితే సూర్యుడు లేకపోతే మనకు వెలుగే లేదు. అంధకారంలో పడి కొట్టుకుపోయేవాళ్ళం. అంతకంటే ముందు అసలు జీవించడమే దుర్భరం అవుతుంది. ఇంతకీ సూర్యుడికి ఇష్టమైన రోజు ఏమిటో తెలుసా? ఆదివారం. ఆదివారాన్ని 'రవివారం' అని కూడా అంటారు. అసలు ఆదిత్యుడి పేరు మీదే ఆదిత్యవారం అని వచ్చింది. క్రమంగా వ్యావహారికంలో (వాడుక భాష) ఆదివారంగా మారింది. సంస్కృతంలో భానువారం అని కూడా అంటారు.

అవునూ, మనకంటే ఆఫీసులకి సెలవు కావట్టి ఆదివారం అంటే ఇష్టం. సూర్యుడికి కూడా ఆదివారమే ఇష్టం కావడమేంటి?సూర్యుడిక్కూడా ఆదివారం రోజు సెలవా ఏమిటి – అని నవ్వుకుంటున్నారా? ప్చ్.. సూర్యుడు కనుక సెలవు తీసుకుంటే మనకు మనుగడే లేదులెండి. మొత్తానికి ఆదిత్యునికి రవివారం మహా ప్రియమైన రోజు.

మనలో కొందరికి గ్రహ దోషాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. రాహువు, కేతువు, కుజుడు మొదలైన గ్రహాల్లాగే ఆదిత్యునికి కూడా దోష నివారణ కోసం గ్రహ సంతులు చేస్తారు. కోణార్క్ సూర్య దేవాలయం ఒరిస్సా రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. మొత్తం దేశంలోనే ఈ సూర్యదేవాలయం ప్రసిద్ధి కాంచింది.

మామూలు ఆదివారాల సంగతి కాసేపు పక్కన పెడితే తాటాకు ఆదివారం అని ఒకటుంది. తాటాకు ఆదివారం నాడు ప్రత్యేక క్రైస్తవ మతస్తులు విందు భోజనం ఏర్పాటు చేసుకుంటారు. ఈ తాటాకు ఆదివారం ఎప్పుడూ ఈస్టర్ ఆదివారం కంటే ముందు ఆదివారం వస్తుందన్నమాట. ఆవేళ నాలుగు సువార్తలను చెప్పిన రోజును గుర్తు చేసుకుంటారు. జీసస్ తన వాంఛ కన్నా ముందు జెరూసలేం లోనికి దగ్విజయంగా ప్రవేశించాడు కనుక దీన్ని వాంఛ ఆదివారం లేదా దేవుని వాంఛతో కూడిన తాటాకు ఆదివారం అంటారు.

ఆదివారం నాడు

"భాస్వన్ కాస్యపగోత్రజో రుణరుచిస్సింహపోర్కస్సమి

త్వట్త్రిస్థో దశశోభానో గురుశశీ భౌమ స్సుమిత్రాస్సదా

శుక్రో మస్తరిపు: కళింగజన పశ్చాగ్నీశ్వరో దేవతా

మధ్యేవర్తుల పూర్వదిగ్దినకరః కుర్యాత్సదా మంగళమ్!”

- అనే మంత్రాన్ని 11 సార్లు జపించుకుంటే చాలా మంచిది.

Share

21, జులై 2011, గురువారం

సాయినాథుని దినచర్య

సాయినాథుని దినచర్య

ప్రత్యక్షదైవంగా హిందువుల పూజలందుకుంటున్న షిర్డీ సాయిబాబా జీవనశైలి యోగులందరికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఆ జీవనశైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది. ఆయన దినచర్య ఎలా ఉండేదంటే...

బాబా ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచేవారు. బాబా ఒకరోజు ద్వారకామాయిలోనూ, మరొకరోజు చావడిలోనూ నిద్రించేవారు. చావడిలో పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథుని భక్తులు మేల్కొలిపి ద్వారకామాయికి తీసుకువచ్చేవారు. ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చుని ధునివైపు చూస్తూ గడిపేవారు. అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు. అప్పటికే గంగాళం నిండా భక్తులు నీళ్ళు సిద్ధం చేసేవారు. ఈ సమయంలో బాబా చాలా కోపంగా కనిపించేవారు. అందువల్ల ఆయన వద్దకు వెళ్ళేందుకు భక్తులు సాహసించేవారు కాదు.

ముఖం కడుక్కున్న తర్వాత కుడిచేతి మణికట్టుకు రోజూ నేతిలో ముంచిన గుడ్డతో కట్టు కట్టుకునేవారు. భక్తులే ఈ కట్టు కట్టేవారు. కట్టు కట్టిన తర్వాత కట్టు కట్టిన వారికి బాబా ఒక రూపాయి ఇస్తుండేవారు. చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా బాబా కట్టుకట్టించుకునే వారు. ఇలా ఎందుకు చేసేవారో తెలియదు.

ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా బిక్షకు వెళ్లేవారు. కేవలం ఐదు ఇళ్లలో మాత్రమే బిక్షాటన చేసేవారు. భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో కొన్ని ధునిలో వేసి, కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి, మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి, మిగిలిన అతి కొద్ది భాగాన్ని తను తినేవారు బాబా. ఆ తర్వాత లెండీకి బయలుదేరేవారు.

సాయినాథునికి ఎండ తగలకుండా కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు. లెండీకి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు. లెండీకి చేరుకోగానే భక్తులు బయటే నిలబడేవారు. బాబా లోనికి వెళ్ళి ఒకటి రెండు గంటలు లెండీలో యోగ సాధన చేస్తూ గడిపేవారు. తిరిగి 11గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు.

ద్వారకమయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకుల గానం మొదలయ్యేది. ఆ సమయంలోనే భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు. ఆ నైవేద్యాలను భక్తులకే పంచిపెట్టేవారు బాబా. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హారతి జరిగేది. హారతి సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు. అయితే బాబా మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు.

హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద ప్రసాదం పంచిపెట్టేవారు. సమాధి మందిరంలో ఈనాటికీ హారతి ముగియగానే బాబాను దర్శించుకుని వచ్చిన భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఈ ప్రసాదం ఉదయం నుండీ బాబాకు భక్తులు సమర్పించిన నైవేద్యం నుండి సేకరించినవి.

సమాధి మందిరం వద్ద బాబా విగ్రహం వద్ద రెండు స్టీలు డ్రమ్ములు ఉంటాయి. బాబా దర్శనానికి వెళ్ళే భక్తులు ఆ డ్రమ్ములలోనే బాబాకు తాము నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న లడ్డూలు, పాలకోవాలు మొదలైన ప్రసాదాలను ఉంచుతారు. వాటినే భక్తులకు తిరిగి పంచిపెడతారు.

సాయినాథుని హారతి అనంతరం ప్రసాదం స్వీకరించిన భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం తిరిగి లెండీ వద్ద కొంతసేపు గడిపి, తిరిగి చావడిలోనో, ద్వారకామాయిలోనే నిద్రకు ఉపక్రమించేవారు బాబా.


17, జులై 2011, ఆదివారం

గంధం సంతోషాన్ని ఇస్తుంది తెలుసా?(Sandalwood)

గంధం సంతోషాన్ని ఇస్తుంది తెలుసా?

(Sandalwood)

హిందూ సంస్కృతిలో గంధానికి చాలా ప్రాధాన్యత ఉంది. మన పూజలు, పునస్కారాల్లో గంధాన్ని తప్పక వినియోగిస్తాం. అందరూ ఉపయోగిస్తున్నారు కనుక గంధాన్ని మనమూ వాడుతున్నామే కానీ, దానివల్ల ప్రయోజం ఏమిటో మనకు అంతగా అవగాహన ఉండదు. సర్వసాధారణంగా మన ప్రతి ఆచారం వెనుకా శాస్త్రీయ కారణం దాగి ఉంటుంది. అందుకే పెద్దలు వాటిని ఆచారాలుగా ప్రతిపాదించారు.

ఇప్పుడు పూజల్లో గంధం ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం.

అభిషేకం చేసిన తర్వాత దేవునికి వస్త్రం, యజ్ఞోపవీతం, అక్షతలతో బాటు గంధాన్ని సమర్పిస్తాం. వస్త్ర, యజ్ఞోపవీతాలను స్వయంగా సమర్పించక పోయినప్పటికీ, మంత్రపూర్వకంగా సమర్పించడం ఆచారంగా కొనసాగుతోంది.

గంధాన్ని మాత్రం నియమం తప్పకుండా ప్రతిరోజూ సమర్పించుకోవాలి. పూజ ముగిసిన తర్వాత గంధాన్ని మెడకు భక్తిగా రాసుకుని, అక్షతలను తలపై జల్లుకోవడం సంప్రదాయం.

గంధం ఎంత సువాసనాభారితంగా ఉంటుందో మనందరికీ తెలుసు. గంధపు చెట్ల పరిమళాలకు తాచుపాములు సైతం ఆకర్షితమై వస్తాయి. అందుకే గంధపు చెట్లు, పున్నాగ చెట్లు, మొగలి పొదల దగ్గర జాగ్రత్తగా ఉండమని పెద్దలు హెచ్చరిస్తారు. ఆ సంగతి అలా ఉంచితే, మంచి గంధపు సువాసన మాటలకు అందని సంతోషాన్ని ఇస్తుంది. అంతే కాకుండా దయాగుణాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.

మనకు తెలిసి, తెలీకుండా మన మనసు ఎక్కడెక్కడో సంచరిస్తుంటుంది. ఆ చంచలత్వం నుండి తప్పించి, మనసును స్థిరంగా ఉంచుకోడానికే మనం పూజలు, ధ్యానాలు చేస్తాం. మనసులో చెలరేగే ఆలోచనలను నియంత్రించడానికి, కలతలు, కష్టాలూ ఏమైనా ఉంటే అరికట్టడానికి పూజలు దోహదపడతాయి. అందుకు గంధం తనదైన పాత్ర పోషిస్తూ సహకరిస్తుంది.

గంధంలో ఉండే దయ, సంస్కారం అనే మంచి వాసనలు, రాగద్వేషాలు అనే మలినాలను పోగొడతాయి. ఇతరత్రా మనలో పేరుకున్న కుసంస్కారాలను సైతం నశింపచేసి సంతోషం పాదుకునేలా చేస్తాయి. అలాగే, తోటివారి మీద ప్రేమ, దయ అంకురించేలా చేస్తాయి.

ఇంకొంచెం లోతుగా వెళ్తే పూర్వ కర్మల వాసనలను అంతమొందించి మళ్ళీ జన్మ ఉండకూడదు అని పూజించడానికి గంధం, అక్షతలు తోడ్పడతాయి.

గంధం మనసుకే కాదు, శరీరానికీ ఎంతో మేలు చేస్తుంది. అందుకే గంధాన్ని కేవలం పూజల్లోనే కాకుండా అనేక సందర్భాల్లో శరీరానికి రాసుకుంటాం.

గంధంతో శరీర ఛాయ పెరుగుతుంది.

గంధం సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది.

గంధం వల్ల చర్మం పేలడం, పొక్కడం లాంటి ప్రతిచర్యలు చూపదు.

గంధంతో చర్మవ్యాధులెన్నో నివారణ అవుతాయి. స్కిన్ రాషెస్, స్కిన్ ఎలర్జీలే కాకుండా చర్మపై వచ్చిన మచ్చలు కూడా తగ్గుతాయి. దురదలు నివారింపబడతాయి.

పొరపాటున చర్మం ఏమైనా కాలితే, కొంచెం గంధం రాస్తే వెంటనే ప్రయోజనం ఉంటుంది.

గంధపుచెక్క లేదా గంధపు పొడిని పట్టు వస్త్రాల మధ్య ఉంచితే సువాసన రావడమే కాకుండా పాడవకుండా భద్రంగా ఉంటాయి.

16, జులై 2011, శనివారం

సంకల్పబలం అంటే ఏమిటి? ముహూర్తం ఎందుకు?

సంకల్పబలం అంటే ఏమిటి? ముహూర్తం ఎందుకు?

(Meaning of Sankalpam & Muhurtham)

మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు, అది నిర్విఘ్నంగా నేరవేలారని బలంగా సంకల్పించుకోవాలి. చేపట్టిన పని మనసా వాచా కర్మణా కోరుకుంటే తప్పకుండా జరిగితీరుతుంది. కృషి, పట్టుదలతో బాటు సంకల్పబలం కూడా చాలా అవసరం. అంతే కాకుండా మంచి ముహూర్తం చూసి పని మొదలుపెట్టాలి. దృఢ సంకల్పము, శుభ ముహూర్తము ఉంటే మోయలేని బండరాయిని కొండమీదికి ఎక్కించగలం. సంకల్పబలం లేకున్నా, మంచి ముహూర్తం లేకున్నా అదే రాతిని కిందికి కూడా తోయలేం.

మనవాళ్ళు భూమిలో విత్తనాలు నాటినా తిథి, వార, నక్షత్రాలు చూస్తారు. ఇదంతా చాదస్తం అని కొట్టిపడేసేవారు ఉన్నారు. కానీ, ఖగోళశాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అలా అనరు. ఇందులో శాస్త్రం ఇమిడి ఉంది. ఏ టెక్నాలజీ, పరికరాలు లేని కాలంలోనే మహర్షులు ఎంతో పరిశ్రమించి, పరిశోధన చేసి, గ్రహాలూ, నక్షత్రాల చలన స్థితి, పరిణామాలు, వాటివల్ల కలిగే ప్రభావాలను ప్రబోధించారు. ఆ అద్భుతమైన, అమూల్యమైన విషయ సమాచారాన్ని తర్వాతి తరాలకోసం నిక్షిప్తం చేసి ఉంచారు.

అందుకే పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలకే కాకుండా ఏ పని ప్రారంభించాలన్నా తిథి, వార, నక్షత్రాలు, నెలలు, సంవత్సరాలు చూడటం అలవాటుగా మారింది. వీటిని సరిగ్గా లెక్కలు వేసి చూస్తే గనుక సత్ఫలితాలు ఉంటాయి. లేకుంటే అనుకున్న పని సవ్యంగా నెరవేరదు. ముహూర్తబలం అలాంటిది. కొన్ని కొన్ని నెలల్లో పెళ్ళిళ్ళు చేయరు. గృహప్రవేశం తలపెట్టరు. వారి వారి నక్షత్రాలను బట్టి ఆయా రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గమనం ఎలా ఉంటుందో లెక్క చూసి, ఆ ప్రకారం పరిగణిస్తారు. అలాగే శుక్లపక్ష, కృష్ణపక్షాలకు కూడా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే ప్రతిరోజూ ఒకేలా ఉండదు.

కేవలం పనుల గురించే కాదు, ఆరోగ్యం కాపాడుకోవడానికి కూడా సంకల్పబలం కావాలి. గ్రహబలం ఉండాలి. చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఏ రకమైన అనారోగ్య సమస్యలూ లేకుండా హాయిగా, ఆనందంగా ఉండాలని బలంగా సంకల్పించుకోవాలి. ఆయా దినాలు, గ్రహ స్థితులను అనుసరించి అలవాట్లు, ఆచారాలను నిర్ధారించుకోవాలి.

ఉపవాసాలు కూడా గ్రహస్థితులను అనుసరించి వచ్చినవే. ఉదాహరణకు మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో, ఏకాదశి మొదలైన ప్రత్యేక రోజుల్లో, గ్రహణ సమయాల్లో సూర్యచంద్రుల స్థానాన్ని బట్టి పొట్ట బరువుగా ఉండకపోవడం మంచిది. అందుకే ఆయా రోజుల్లో ఉపవాసం ఉంటారు. మన పెద్దలు ఆచారం, నమ్మకం పేరుతో ప్రతిపాదించినవన్నీ కూడా శాస్త్రీయమైనవే అని గుర్తించి, గుర్తుంచుకోవాలి.

14, జులై 2011, గురువారం

ముద్దుకే ముద్దొచ్చే రూపాలు (Nature's Gifts)

నమ్మలేని నిజాలు (Mysteries and Miracles)

ముద్దుకే ముద్దొచ్చే రూపాలు (Nature's Gifts)

ఇతర ఏ జంతువుల్లో లేని కళా హృదయం మనలో ఉంది. లోకంలో బ్రహ్మాండమైన ఆర్టిస్టులున్నారు. వాళ్ళు వేసిన బొమ్మలు, చిత్రాలు అద్భుతంగా, అపురూపంగా ఉంటాయి. ఈ సృజన సంగతి అలా ఉంచితే దేవుని మించిన కళాకారుడు లేడు. చెట్లు, పుట్టలు, కొండలు, కోనలు మేఘాలు, సముద్రాలు - ఆ అందాలు చూసి తరించాలే కానీ,వర్ణించడానికి మాటలు చాలవు.

ప్రకృతి అందాల సంగతి అలా ఉంచితే, కొన్నిసార్లు ఆ సౌందర్య తునకల్లో ఇంకా అద్భుతమైన దృశ్యాలు ఇమిడిపోయి, ముద్దుకే ముద్దొచ్చేట్టుగా, సమ్మోహనమైన సుమాలతో ఆకృతులు కూర్చినట్లుగా ఉంటాయి. చేతులకు వేసుకున్న గాజులు చూసుకోడానికి అద్దం అక్కర్లేదు అన్నట్టు వీటిని వర్ణించాల్సిన పనేముంది, మీరే చూడండి..

మనం ఎప్పుడూ ఏవో పనుల్లో కూరుకుపోయి తల పైకెత్తి చూడం గానీ, మబ్బులు తెగ సోయగాలు పోతాయి.మహా అందంగా ఉంటాయి. మురిపించే మేఘ మాలికల్లో వివిధ ఆకృతులు కనిపిస్తూ ఉంటాయి. మబ్బుల్లో టెడ్డీ బేర్ చూడండి.. ఇది ఎంతమాత్రం ట్రిక్ ఫొటోగ్రఫీ కాదు.

కొండల్ని బండరాళ్ళు అనుకుంటే పొరపాటే. వాటిని అపురూపమైన శిల్పాలుగా చెక్కిన శిల్ప చక్రవర్తులు ఉన్నారు. అదలా ఉంచితే, ఎక్కడో దూరంగా ఉన్న కొండలు ఎవరూ చెక్కకుండానే సహజంగా ఆకృతులు ఏర్పరచుకుంటే...

10, జులై 2011, ఆదివారం

సంధ్యావందనం ఎందుకు చేయాలి?

సంధ్యావందనం ఎందుకు చేయాలి?

(Purpose of Sandhyavandanam)

సంధ్యావందనం అనే ఆచారాన్ని ఒక సంప్రదాయంగా, మొక్కుబడిగా చేయడం కంటే, దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకోవడం వల్ల మరింత శ్రద్ధాసక్తులతో చేసే అవకాశం ఉంది. సూర్యభగవానుడు ఒక్కడే. కానీ, ఆయనలో అద్వితీయమైన మూడు శక్తులు, ఏడు రంగుల కిరణాలు ఉన్నాయి.

"ధ్యేయస్సదా సవిత్రు మండల మధ్యవర్తీ నారాయణః సరసిజానన సన్నివిష్టః" అనేది మంత్రం. అంటే సూర్యుడు స్పష్టంగా కనిపించే ప్రత్యక్ష దైవం అన్నమాట. ఇందుకు వేదాల్లో అనేక ప్రమాణాలు ఉన్నాయి.

సూర్యునిలో కనిపించే సప్త వర్ణాలే సప్త అశ్వాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వెలిగించే పరబ్రహ్మ తత్వం సూర్యుడు. త్రిమూర్తుల శక్తులను విడివిడిగా చూపించే దివ్య నారాయణ మూర్తి సూర్యుడు. సూర్యభగవానుడిలో సావిత్రి, గాయత్రి, సరస్వతి అనే మూడు మహా శక్తులు కేంద్రీకృతం అయ్యుంటాయి. అందుకే సూర్యునికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర వేళల్లో మూడుసార్లు సంధ్యావందనం చేయాలి.

త్రి సంధ్యల్లో సంధ్యావందనం చేయడం వల్ల సూర్యునిలో దాగివున్న సావిత్రి, గాయత్రి, సరస్వతి శక్తులు మన సొంతం అవుతాయి.

ఆయా శక్తులను

"గాయత్రీం ఆవాహయామి

సావిత్రీం ఆవాహయామి

సరస్వతీం ఆవాహయామి"

అనే మంత్ర సాయంతో ఆకర్షించి గ్రహించే సాధన సంధ్యావందనం. ఈ మంత్రాన్ని మూడుసార్లు భక్తిగా స్మరించి, నమస్కరించుకోవాలి. త్రి సంధ్యల్లోనూ క్రమం తప్పకుండా సంధ్యావందనం ఆచరించాలి. ఈ మూడు శక్తులూ ఘనీభవించిన మూర్తియే గాయత్రి. కనుకనే గాయత్రిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.

సంధ్యావందనంలో ఆచమనం, ప్రాణాయామం, అఘమర్షణం,అర్ఘ్యప్రదానం, గాయత్రి మంత్రజపం, ఉపస్థానం అనేవి అంగాలు.

మూడు సంధ్యలూ ఒకే మాదిరిగా ఉండవు. సూర్య తాపము, ప్రభావము వేరువేరుగా ఉంటాయి. ఉదయ సూర్యుడిని బాలార్క అని, సాయంత్ర సూర్యుని వృద్దార్క అని అంటారు. ఉదయానే ఏమంత ప్రభావం చూపడు. సాయంత్ర వేళలో సూర్యుడు గొప్ప ప్రభావాన్ని చూపుతాడు. ఇక మధ్యాహ్న సమయంలో సూర్యుని వేడిమి సహించలేనిదిగా ఉంటుంది. అయితే మూడు దశల్లోనూ సూర్యుని కిరణాలను చూడటం చాలా అవసరం. కనుకనే సంధ్యావందనం పేరుతో ఒక ఆచారాన్ని ప్రతిపాదించారు. దాన్ని కొనసాగించడంవల్ల మనసుకు శాంతి అనుభూతమౌతుంది. శరీర ఆరోగ్యమూ బాగుంటుంది.