HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

28, ఆగస్టు 2013, బుధవారం

krishna astami subhakankshalu

August 28, 2013 - Wednesday
శ్రీ విజయనామ సంవత్సరం, దక్షిణాయనం,వర్ష ఋతువు
Week వారము : Wednesday, Month : శ్రావణ, Paksha : బహుళపక్షం
Tithi తిథి : అష్టమీ 04:13 AM (next day)
Sunrise సూర్యోదయం : 06:02 AM, Sunset సూర్యాస్తమయం : 06:24 PM
Moonrise చంద్రోదయం : 05:30 AM
Star నక్షత్రం : కృత్తికా 12:42 PM
Yogam యోగం : వ్యాఘాత 04:49 PM
Solar Zodiac సూర్యరాశి : సింహ, Lunar Zodiac చంద్రరాశి : వృషభ
Rahukalam రాహుకాలం : 12:12 PM to 01:46 PM
Yamagandam యమగండం : 07:36 AM to 09:07 AM
Durmuhurtham దుర్ముహూర్తం : 11:48 AM to 12:38 PM
Amritakalamu అమృతకాలం : 10:04 AM to 11:50 AM

సుముహూర్తం

సుముహూర్తం

సనాతన ధర్మ సంస్కారాల్లో 'వివాహం' అతి ప్రధానమైనది. సూర్య కిరణాలు తాకగానే పద్మం వికసించినట్లు, మానవజీవితంలో వివాహం తొలి వెలుగులను విరజిమ్ముతుంది ధర్మార్ధ కామ మోక్షములను సాధించే రాచబాటే మన వివాహ వ్యవస్థ. అందుకే విదేశీయులను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. ఇంక పెళ్ళి ప్రక్రియలు అనేకం. వాటిలో "శుభముహూర్తం " లేదా "సమీక్షణం" అతి ముఖ్యమైనది. వధూవరులిద్దరూ పెళ్ళి మంటపం మీద తూర్పు, పశ్చిమ ముఖాలుగా కూర్చుంటారు. వారి కుడి చేతికి జీలకర్ర, బెల్లం కలిపిన ముద్దలు ఇస్తారు. వారి వివాహానికి సరిగ్గా, నిర్ణయించిన సుముహూర్తం సమయంలో, వేద ఘోష, మంగళ వాయిద్యాలు మధ్య ఆ మిశ్రమాన్ని వధూవరులు ఒకరి తలపై మరొకరు ఉంచి, అణచి పట్టుకొని, శిరస్సులను తాకుతారు. ఒక ప్రక్క "గట్టి మేళం" మ్రోగుతూనే ఉంటుంది. అంతవరకు వారిద్దరి మధ్యా అడ్డుగా ఉన్న తెర/తెరశెల్లాను తొలగిస్తారు. అప్పటి వరకు వేచియున్న వధూవరులు ఒకరినొకరు పవిత్రంగా చూసుకొంటారు. దీనినే "సుమూహుర్తం" అంటారు. ఇదే సమయంలో వేదపండితులు ఋగ్వేదంలోని ఈ మంత్రాన్ని ఉచ్ఛరిస్తారు.

"ధృవంతే రాజావరుణో ధృవం దేవో బృహస్
ధృవంతే ఇంద్రశ్చాగంచ్ఛ రాష్ట్రం థార్యతాం ధృవం."

అంటే " ఓ రాజా! రాజైన వరుణుడు, దేవతలైన బృహస్పతి, ఇంద్రాగ్నులు నీ రాజ్యాన్ని స్థిరమొనర్చుగాక." అలాగే, ఈ గృహస్తు జీవితం నిలకడగా ఆనందంగా జీవించాలని, చివరిదాక ఇద్దరూ ఎడబాటు లేకుండా ఉండాలని, అన్యోన్యమైన దాంపత్యాన్ని కలిగిఉండాలనే ఆకాంక్షే దీని పరమార్ధం. వరుడి శ్రేయం కోరడమే ఇందులోని ముఖ్యాంశం.

ఇహ జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని వినియోగించడంలో కల ప్రయోజనం: జీలకర్ర వృద్ధ్యాప్యం రాకుండా దోహదపడుతుంది. అందువలన శుభకార్యాల్లో దీని వినియోగం మంగళప్రదం. అందుకే జీలకర్రని వంటలలో కూడా విరివిగా వాడతారు. బెల్లం భోగ్య పదార్ధం. ఇది మధురంగాను, తన మధురాన్ని ఇతర వస్తువుల్లోకి సంక్రమింప చేసేదిగాను, పవిత్రమయినదని, కృష్ణ యజుర్వేద సంహిత చెబుతోంది. ఈ రెంటిని కలిపి నూరినా, నమిలినా "ధనసంజ్ఞకమైన విద్యుత్తు"(POSSITIVE ELECTRONIC CHARGE) కలుగుతుందని పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువలనే ఈ మిశ్రమ సంయోగం వలన ఒక క్రొత్త శక్తి పుడుతుందనీ, దీనిని తలపై పెట్టినపుడు వధూవరుల శరీరాల్లో ఒక విశిష్ట ప్రేరణ కలిగి , పరస్పర జీవ శక్తుల ఆకర్షణకు సహాయపడుతుందని చెబుతారు. అందుకే ఈ మిశ్రమం పావనం, మంగళకరం అని మహర్షుల మాట. అలాగే మన వివాహ వ్యవస్థ లో మాంగల్య ధారణ, సప్తపది, తలంబ్రాలు మొదలయిన ప్రక్రియల్లో కూడా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్నది పెద్దల మాట.[బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి బ్లాగ్ నుండి సేకరణ]

26, ఆగస్టు 2013, సోమవారం

ప్రదక్షిణము చేస్తాము - ఎందుకు?

ప్రదక్షిణము చేస్తాము - ఎందుకు?


మనము దేవాలయాన్ని దర్శించినప్పుడు ప్రార్ధన, పూజ అనంతరము గర్భాలయము చుట్టూ కుడి చేతి వేపుగా తిరగడమే ప్రదక్షిణ.
ప్రదక్షిణము ఎందుకు చేస్తాము?
ఒక కేంద్ర బిందువు లేనిదే మనము ఒక వృత్తాన్ని చిత్రీకరించలేము. భగవంతుడు మన జీవితాలకు కేంద్రము, ఆధారము మరియు సారము. మనము ఆయనను కేంద్రముగా చేసికొని మన జీవిత కార్య కలాపాలు సాగిస్తాము. ఈ ప్రాముఖ్యతను తెలిపేదే ప్రదక్షిణము.

ఒక వృత్తానికి దాని పరిధి లోని ప్రతి బిందువు కేంద్ర స్థానము నుంచీ సమానమైన దూరంలోనే ఉంటుంది. అనగా మనమెక్కడ ఉన్నప్పటికీ, ఎవరమయినప్పటికీ, భగవంతునికి అందరమూ సమానమైన సన్నిహితులమే. పక్షపాత రహితముగా ఆయన కరుణ అందరి వైపు ఒకేలాగా ప్రవహిస్తూ ఉంటుంది.

ప్రదక్షిణ ఎడమ నుండి కుడికి గుండ్రగానే ఎందుకు చేయబడుతుంది?
ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడు మనకు కుడివైపు ఉంటాడు. అందుకని కుడి వైపు నుంచి ప్రదక్షిణము చేస్తాము. భారత దేశములో కుడి వైపు అనేది శుభ ప్రదత ను తెలుపుతుంది. ఆంగ్ల భాషలో కూడా సరైన, సరికాని అని చెప్పడానికి రైట్ సైడ్ / రాంగ్ సైడ్ అనే పదాలు వాడతారు. అందువలన గర్భాలయంను కుడి వైపుగా ఉంచి ప్రదక్షిణము చేసేటప్పుడు మనకు అన్ని వేళలా సహాయము, శక్తిని ఇచ్చి, మార్గ దర్శకత్వము అయి మన జీవితాన్ని ధర్మము వైపు నడిపించే వాడయిన భగవంతునితో బాటు ఋజు వర్తనము కలిగి శుభప్రదమైన జీవితాన్ని గడపాలని గుర్తు చేసికోవాలి. మనము అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే వాటిని కుడి వైపున అంత కన్నా తక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చే వాటిని వెడమ వైపున ఉంచడము మన సాంప్రదాయం. ఈ విధముగా చేయడము వలన అధర్మ ప్రవృత్తుల నుంచి బయట పడి మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా సవ్య మార్గములో నిలబడతాము.

భారతీయ వేద గ్రంధాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిధి దేవో భవ అని శాసిస్తాయి. నువ్వు నీ తల్లిదండ్రులను మరియు గురువులని భగవత్స్వరూపులుగా భావించుదువు గాక! ఈ భావముతో మనము మన తల్లి దండ్రులకు మరియు మహాత్ములకి కూడా ప్రదక్షిణ చేస్తాము. తన తల్లి దండ్రులకి గణపతి దేవుడు ప్రదక్షిణ చేసినట్లు చెప్పే కధ అందరికీ తెలిసినదే.

సంప్రదాయ పద్దతి ప్రకారము పూజ పూర్తి చేసిన తరువాత మనము విధిగా ఆత్మ ప్రదక్షిణ చేస్తాము. ఈ విధముగా చేయడము వలన బాహ్యముగా విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడే మనలో ఉన్న విశిష్టమైన దివ్యత్వముగా గుర్తిస్తాము. మనము ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది విధంగా స్తుతిస్తాము.

యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఎన్నో జన్మలుగా చేయబడిన పాపాలన్నీ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగులోనూ నశింపబడు గాక!
 · sarvaprani sukhinobhavantu nundi  sekarana

29, జూన్ 2013, శనివారం

కనుమరుగావబోతున్న 113 సం।। హేవలాక్ బ్రిడ్జి


కనుమరుగావబోతున్న 113 సం।। హేవలాక్ బ్రిడ్జి




 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చ రేకేస్తిస్తున్న గోదావరిమాత  పైన వేణువుగా  నిలచిన పాత రైలు వంతెన హేవలాక్ ను ప్రారంభించిన ఆ నాటి మదరాసు గవర్నర్ సర్ ఆర్ధర్ ఎలంబిక్ హేవలాక్ బ్రిటిష్ పాలకులచే సెహబాష్ అనిపించుకొని అనేక ప్రాంతాలలో గవర్నర్ గా చేసిన ఆయన మదరాసు గవర్నర్ గా వున్నా కాలం లో గోదావరి పాత రైలు వంతెనను ప్రారంభించి ధన్యుడయ్యాడు ్‌ఎవలొక్ వర్ధంతి జూన్ 25 న జరిగింది.బానిస వ్యవస్తకు వ్యతిరేకంగా ఉద్యమించిన హేవలోక్ సిలోన్ గవర్నర్ గా వున్నపుడు బియ్యం పైన ,ధాన్యం పైన పన్నును రద్దు చేసి ఘననీయుడు అయ్యాడు .
 గోదావరి నది పై  నూట పదమూడు క్రితం కట్టబడి  వంద  సంవత్సరములు అయుష్హే  రికార్డులలో రాసినందున ఈ రోజు మన రైల్వే బోర్డు ఈ బ్రిడ్జి ని ఇనపతుక్కుగా కేవలం 5 కోట్ల రూపాయల అంచనాగా అమ్మాలని  నిర్ణ ఇంచింది .
ఈ బ్రిడ్జి ని పర్యాటకముగా మరియు పాదచారులకు రాజముండ్రి కొవ్వూరుల ను కలుపుతూ ఉంచాలని ఎన్నో రోజుల నుండి ఉభయగోదావరి ప్రజలు కొరుతున్నరు. కాని రైల్వే బోర్డు నిర్ణయం ఆకోరికను తుంగలో తొక్కిన్ది.
హేవలోక్ బ్రిడ్జి డేటా
శంకు స్తాపన --------11-11-1897
తోలి ప్రయాణం -------6-8-1900
ప్రారంభించింది --------మదరాసు గవర్నర్ హేవలోక్
తోలి రైలు పరుగు ----- హౌరా మెయిల్
తోలి ప్రయానికులలో ఒకరు ---చిలకమర్తి లక్ష్మి నరసింహం
వర్క్ ఇంజనీర్ ఇన్ చీఫ్ -------ఎఫ్. టీ . జి .వాల్షణ్
విస్తీర్ణం ------------------------ 23 వేల చదరపు అడుగులు
వెయ్యి చదరపు అడుగులకు
రెండు సార్లు పెయింట్ ఖర్చు ------11 రూపాయల 5అణాల  9 పైసలు
బ్రిడ్జి నిర్మాణానికి అంచనా --------రూ  50 ,40,457\-
ఖర్చైనది -------------------------రూ 46,89,849\-
మిగిలినది -----------------------రూ .,56,698\-
బ్రిడ్జి పొడవు -------------------- 9,096 అడుగులు
స్తంబాలు -----------------------54

ఈరోజులలో అంచనాల తర్వాత ఇంత మిగిలింది అని చెప్పగల ప్రాజెక్ట్ ఏమైనా వుంటే చెప్పండి .[కాంట్రాక్టర్కి కాదండి బాబు]
ఇటువంతిబ్రిద్గేని కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది .కావున దయచేసి అందరూ ఎవరికీ తొచినవిధముగా వారు రైల్వే బోర్డు కి [ఈ మెయిల్స్ ,ఎస్ ఎం ఎస్ లు, పోస్ట్ కార్డ్స్, ద్వారా ] బ్రిడ్జి ని కాపాడవలసిన ఆవశ్యకత ను తెలియచేయవలసింది.

ఇది గుడిగంట ఆద్యాత్మిక వారపత్రిక నుండి సేకరణ




19, జూన్ 2013, బుధవారం

విశ్వదాభిరామ వినురవేమ

చిక్కి ఉన్న  వేళ  సింహంబు నైనను
బక్క కుక్క కరచి బాధ పెట్టు
బలిమి లేని వేళ  పంతంబు చెల్లదు
విశ్వదాభిరామ  వినురవేమ

పాపం కే కే గారి పరిస్తితి 

18, జూన్ 2013, మంగళవారం

హాయ్

హాయ్
చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకొంటున్నందుకు చాలా ఆనందంగా వుంది . ఈ రోజు నుండి మళ్ళీ నాకు తెలిసిన విషయాలు అందరితో పంచుకుందామని వస్తున్నాను.
----మీ మూర్తి 

4, జనవరి 2013, శుక్రవారం

30 YEARS INTERNET

ఇంటర్నెట్ కు 30 ఏళ్ళు 

1983 జనవరి 1 న ప్రారంభం ,ప్రపంచ సమాచార వ్యవస్తనే మార్చేసిన సాంకేతిక విప్లవం

మానవజాతి ప్రస్తానాన్ని మలుపుతిప్పిన శాస్త్రీయ  ఆవిష్కరణ లో ఇటీవలికాలంలో చెప్పుకోదగినది ఇంటర్నెట్ మాత్రమె .ప్రపంచ ప్రజలమద్య గతంలో ఎన్నడు లేనట్టి వేగవంతమైన ,చవకైన సమాచార వారధిగా ఆవిర్భవించిన ఇంటర్నెట్ జనవరి 1 న 0 వ జన్మదినోస్తావము జరుపుకొంది ఇంటర్నెట్ అనే మహా సాంకేతిక విప్లవము 1 జనవరి 1983 న ప్రారంభమైనది. ఆరోజు అమెరికా రక్షణ శాఖ నేతృత్వములోని  ఆర్భా నెట్ ప్రాజెక్ట్ పూర్తీ స్థాయి లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ సూట్ [ఐ పి ఎస్ ]సమాచారవ్యవస్తకు మారింది కంపుతెర్లను అనుసంధానించే ఈ వ్యవస్తే తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ కు దారి తీసింది. ఇంటర్నెట్ రాక ముందు ఉన్న ఆర్బ నెట్ 1960 ల చివర్లో సైనిక పరిశోధక ప్రాజెక్ట్ గా మొదలైంది ,అయతే మారుతున్న అవసరాల దృష్ట్యా ఆర్భా నెట్ ను మెరుగుపరుస్తూ వచారు .సమాచార వ్యవస్థ ఓకీ దగ్గర కేంద్రీకృతమై వుంటే శత్రువుల నుంచి ప్రమాదము పొంచి ఉంటుందని ,అలా కాకుండా ఈ వ్యవస్తను వికేంద్రీకరించాలని భావించారు ఈ క్రమములోనే ఇంటర్ నెట్ ప్రోటోకాల్ అనే వ్యవస్థ 1983 నాటికి ఆవిర్భావించిది .బ్రిటిష్ కంప్యూటర్ శాస్త్రవేత్త టీం బెర్నేన్స్ లీ .. 1983 లో వరల్డ్ వైడ్ వెబ్ పేరుతొ  ఇంటర్ లింక్డ్  హైపర్టెక్స్ట్  డాక్యుమెంట్ ను ఇంటర్నెట్ లోకి ప్రవేసపెట్టటంతో ఈ నూతన సాంకేతిక వ్యవస్థ మరో గొప్ప ముందంజ వేసింది .ఈ రోజు మనం  ఉపయోగిస్తున్న ఇంటర్నెట్  ఈ విదముగా పలు దశల్లో అభివృద్ధి చెందింది .
 
ఈ సమాచారం 2.1.13 తేదీ  ఈనాడు న్యూస్ పేపర్ నుండి సేకరించబడినది